ఇక్కడే: ఏపీలో మూడు కొత్త విమానాశ్రయాలకు అనుమతి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా నిర్మించతలపెట్టిన పలు విమానాశ్రయాలకు అనుమతులు లభించాయి. ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న భోగాపురం, కర్నూలు, నెల్లూరు విమానాశ్రయాలకు పూర్తి అనుమతులు లభించాయి.
ఢిల్లీలో సోమవారం జరిగిన పౌరవినమానయాన శాఖ ఉన్నతస్థాయి కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఎయిర్ పోర్టుల నిర్మాణానికి బిడ్డింగ్ దాఖలు చేయడానికి మార్గం సుగమం అయింది.
కాగా, తెలంగాణలోని ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో విమానాలు దిగేందుకు అవసరమైన తొలి అనుమతులు కూడా ఈ సందర్భంగా మంజూరు చేశారు.
Comments
andhra pradesh telangana airports bhogapuram kurnool nellore kothagudem ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విమానాశ్రయాలు భోగాపురం కర్నూలు నెల్లూరు కొత్తగూడెం
English summary
It is said that the permission granted for new airports in Andhra Pradesh state.
Story first published: Monday, September 26, 2016, 15:29 [IST]