గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గుంటూరులో దారుణం: చేతబడి చేస్తున్నాడని కొట్టి చంపారు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో మత్తన గురువారెడ్డి(55) అనే వ్యక్తిని గ్రామస్థులు కొట్టిచంపారు. ఈ ఘటన జిల్లాలోని గురజాల మండలం గోగులపాడు గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోటు చేసుకుంది.

గురువారెడ్డిని తాళ్లతో కట్టేసి రాళ్లు, కర్రలతో విచక్షణారహితంగా కొట్టి చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సమీప ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Person killed in guntur by doing Black Magic

ఇంట్లోకి దూసుకెళ్లిన ట్రాక్టర్: మహిళ మృతి

గుంటూరు జిల్లా తాడేపల్లి గూడెంలోని మహానాడు కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు ఒంటి గంట సమయంలో ఓ ట్రాక్టర్ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది.

ఈ ఘటనలో ఇంట్లో నిద్రిస్తున్న లలిత కుమారి(32) అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందగా, మరో చిన్నారికి గాయాలయ్యాయి. గాయపడిన చిన్నారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో యవకుడు మృతి

విజయనగరం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే బలిజపేట మండలం అంతవరం గ్రామశివారు వద్ద మోటారుబైక్‌పై వెళ్తుండగా వెనుక నుంచి వ్యాన్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.

మృతుడు బలిజపేట మండలం కావారివాడ గ్రామానికి చెందిన రావెలపల్లె మధుసూదన్ రావు(29)గా గుర్తించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

English summary
Person killed in guntur by doing Black Magic.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X