తిరుమలలో పాస్టర్: టీటీడీ ముందు ఆందోళన (పిక్చర్స్)
హైదరాబాద్: తిరుమలలో మొండితోక సుధీర్ అనే పాస్టర్ క్రైస్తవ మత ప్రచారం చేసిన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుమలలో మత ప్రచారం పైన భక్తులు, హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.
హైదరాబాదులోని హిమయత్ నగర్ తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద గురువారం బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే తిరుమలలోను మత ప్రచారం జరుగుతోందని మండిపడ్డారు.
కాగా, మొండితోక సుధీర్ను తిరుమల టు టౌన్ పోలీసులు కృష్ణాజిల్లా విస్సన్నపేట మండలం రామానగరంలోని ఆయన స్వగృహంలో గురువారం రాత్రి అదుపులోకి తీసుకుని తిరుపతికి తరలించారు. అతనిని మీడియా ముందు ప్రవేశ పెట్టారు.
బజరంగ్ దళ్
హైదరాబాదు హిమయత్ నగర్లోని తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద బజరంగ్ దళ కార్యకర్తలు గురువారం ఉదయం ఆందోళన చేపట్టారు.
బజరంగ్ దళ్
హిమయత్ నగర్లోని తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద బజరంగ్ దళ కార్యకర్తలు గురువారం ఉదయం ఆందోళన చేపట్టారు. తిరుమలలో మత ప్రచారం చేసిన పాస్టర్ను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.
బజరంగ్ దళ్
లిబర్డీ చౌరస్తాలోని తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద బజరంగ్ దళ కార్యకర్తలు గురువారం ఉదయం ఆందోళన చేపట్టారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు.
సుధీర్
శ్రీ వేంకటేశ్వర స్వామి నిలయమైన తిరుమలలో క్రైస్తవ మత ప్రచారం చేసిన మొండితోక సుధీర్ను తిరుమల టు టౌన్ పోలీసులు కృష్ణాజిల్లా విస్సన్నపేట మండలం రామానగరంలోని ఆయన స్వగృహంలో గురువారం రాత్రి అరెస్టు చేశారు.