అన్నీ బాగున్నాయి, చూశాకే: బస్సులో బొత్స (పిక్చర్స్)
హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం ఆర్టీసి బస్సులో ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. బస్సుల్లోను విమానాల్లో మాదిరిగా అన్ని రకాల రక్షణ చర్యలు పాటించాల్సిందేనని బొత్స ఈ సందర్భంగా అన్నారు. ఇందుకు సంబంధించి నిబంధనావళిని రూపొందిస్తున్నట్లు చెప్పారు.
తొలి విడతగా ఆర్టీసిలోని 320 ఎసి బస్సుల్లో రక్షణ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రయాణీకులు ఎక్కగానే బస్సుల్లోని టీవీల్లో ఏయే భద్రతా చర్యలు ఉన్నాయో, ప్రమాద సమయంలో వాటిని ఎలా వినియోగించుకోవాలో అనే దానిపై డివిడిని ప్రదర్శిస్తారు. బస్సు భవన్లో బొత్స ఇందుకు సంబంధించిన డివిడిని ఆవిష్కరించారు.
మిగతా బస్సుల్లోని అంచెలంచెలుగా రక్షణ చర్యలు చేపడతారు. పర్మిట్కు అనుమతిచ్చే సమయంలోనే ఇవన్నీ ఉండేలా చూస్తామన్నారు. ఏటా రూ.200 కోట్ల గ్యాప్ ఫండ్ను ఇచ్చామని, ఈసారి రూ.500 కోట్లకు పెంచామని బొత్స చెప్పారు. కాగా, బస్సులో భద్రతా డెమోను ప్రయాణీకులు చూశాకే కదిలాల్సి ఉంటుంది.
బస్ భవన్ 1
ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బస్ భవన్లో బస్సుల్లోని భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.
బస్ భవన్ 2
బస్సుల్లోను విమానాల్లో మాదిరిగా అన్ని రకాల రక్షణ చర్యలు పాటించాల్సిందేనని బొత్స ఈ సందర్భంగా అన్నారు. ఇందుకు సంబంధించి నిబంధనావళిని రూపొందిస్తున్నట్లు చెప్పారు.
బస్ భవన్ 3
బస్సు భవన్లో భద్రతా చర్యలకు సంబంధించిన డివిడిని బొత్స సత్యనారాయణ ఆవిష్కరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
బస్ భవన్ 4
ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం ఆర్టీసి బస్సులో ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
బస్ భవన్ 5
బస్సుల్లోను విమానాల్లో మాదిరిగా అన్ని రకాల రక్షణ చర్యలు పాటించాల్సిందేనని బొత్స ఈ సందర్భంగా అన్నారు. ఇందుకు సంబంధించి నిబంధనావళిని రూపొందిస్తున్నట్లు చెప్పారు.
బస్ భవన్ 6
ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం ఆర్టీసి బస్సులో ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
బస్ భవన్ 7
బస్సుల్లోను విమానాల్లో మాదిరిగా అన్ని రకాల రక్షణ చర్యలు పాటించాల్సిందేనని బొత్స ఈ సందర్భంగా అన్నారు. ఇందుకు సంబంధించి నిబంధనావళిని రూపొందిస్తున్నట్లు చెప్పారు.
బస్ భవన్ 8
తొలి విడతగా ఆర్టీసిలోని 320 ఎసి బస్సుల్లో రక్షణ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రయాణీకులు ఎక్కగానే బస్సుల్లోని టీవీల్లో ఏయే భద్రతా చర్యలు ఉన్నాయో, ప్రమాద సమయంలో వాటిని ఎలా వినియోగించుకోవాలో అనే దానిపై డివిడిని ప్రదర్శిస్తారు.