అభిమాని కుటుంబానికి చిరు, చెర్రీ ఓదార్పు (పిక్చర్స్)
బెంగళూరు: మహబూబ్ నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన వోల్వో బస్సు ప్రమాదంలో మృతి చెందిన కర్నాటక రాష్ట్ర చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ కుటుంబ సభ్యులను గురువారం కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ తేజ కలిసి ఓదార్చి, ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ... వెంకటేష్ యాదవ్ చనిపోవడం తనను ఎంతో కలచివేసిందన్నారు. ఆయన కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పారు.
రామ్ చరణ్ మాట్లాడుతూ.. తన తండ్రితో పాటు మెగా హీరోలకు వెంకటేష్ యాదవ్ అభిమానిగా ఉండే వారన్నారు. ఆయన మృతి దురదృష్టకరమన్నారు. కాగా ఇటీవలె వెంకటేష్ కుటుంబ సభ్యులను కలిసి నాగబాబు రూ.5 లక్షల డిడిని అందించిన విషయం తెలిసిందే. దీనిపై చిరు మాట్లాడుతూ... ఇది తొలి సహాయమేనని మరింత సాయం చేస్తామన్నారు.
చిరు 1
కొద్ది రోజుల క్రితం మహబూబ్ నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన వోల్వో బస్సు ప్రమాద ఘటనలో సజీవ దహనమైన కర్నాటక మెగా అభిమానుల సంఘం నాయకుడు వెంకటేష్ యాదవ్ కుటుంబాన్ని పరామర్శిస్తున్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి, రామ్ చరణ్.
చిరు 2
మహబూబ్ నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన వోల్వో బస్సు ప్రమాద ఘటనలో సజీవ దహనమైన కర్నాటక మెగా అభిమానుల సంఘం నాయకుడు వెంకటేష్ యాదవ్ కుటుంబాన్ని పరామర్శిస్తున్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి, రామ్ చరణ్.
చిరు 3
చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ నుండి ఐదు లక్షల రూపాయలను ఇటీవల నాగబాబు వెంకటేష్ కుటుంబానికి అందజేశారు. కర్నాటక రాజధాని బెంగళూరులో సోమవారం నిర్వహించిన పెద్ద కర్మలో నాగబాబు పాల్గొన్నారు.
చిరు 4
ఇటీవలె వెంకటేష్ కుటుంబ సభ్యులను కలిసి నాగబాబు రూ.5 లక్షల డిడిని అందించిన విషయం తెలిసిందే. దీనిపై చిరు మాట్లాడుతూ... ఇది తొలి సహాయమేనని మరింత సాయం చేస్తామన్నారు.
చిరు 5
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ తేజ రావడంతో భారీగా గుమికూడిన అభిమానులు, ఇతరులు.
చిరు 6
ఇటీవల నాగబాబు వెంకటేష్ కుమార్తెలిద్దరికి రూ.3 లక్షలు, భార్య శాంత, తండ్రి సుందర రాజ్లకు రామ్ చరణ్ తేజ, అల్లు అర్జున్ అందించిన రూ.లక్ష డిడిలను నాగబాబు అందించారు.
చిరు 7
కొద్ది రోజుల క్రితం మహబూబ్ నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన వోల్వో బస్సు ప్రమాద ఘటనలో సజీవ దహనమైన కర్నాటక మెగా అభిమానుల సంఘం నాయకుడు వెంకటేష్ యాదవ్ కుటుంబాన్ని పరామర్శిస్తున్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి, రామ్ చరణ్.