జూ.ఎన్టీఆర్ను ఓదార్చిన లోకేష్: హరికృష్ణ కంటతడి (పిక్చర్స్)
హైదరాబాద్: నందమూరి హరికృష్ణ తనయుడు నందమూరి జానకిరాం అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం ముగిశాయి. నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారు. మొయినాబాద్లోని ముర్తూజగూడలోని ఫాం హౌస్లో అంత్యక్రియలు పూర్తయ్యాయి. కొడుకు మృతితో హరికృష్ణ తల్లడిల్లిపోయారు.
జానకిరాం కొడుకు తారక రామారావు చితికి నిప్పంటించారు. నందమూరి కుటుంబంతో పాటు సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు, అభిమానులు హాజరయ్యారు.
అంత్యక్రియల సమయంలో హరికృష్ణ, జూఎన్టీఆర్, కల్యాణ్ రామ్ .. అందరు కన్నీటిపర్యంతమయ్యారు. ఎన్టీఆర్ తట్టుకోలేక ఉబికి వస్తున్న కన్నీటితో అక్కడ్నుండి కొద్దిదూరం వెళ్లిపోయారు. లోకేష్, ఎన్టీఆర్, కల్యాణ్ రాంలను ఓదార్చారు.
జానకిరాం చితి వద్ద..
జానకిరాం చితివద్ద ఆయన తనయుడు చిన్నారి నందమూరి తారక రామారావు, హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్లు.
జూ.ఎన్టీఆర్
మొయినాబాదులో జానకిరాం అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో చితివద్ద కన్నీరుమున్నీరు అవుతున్న జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్.
కల్యాణ్ రామ్
మృతి చెందిన తండ్రి జానకిరాం చితి చుట్టు తిరుగుతున్న తనయుడు తారక రామారావు. అతనికి సహకరిస్తున్న కల్యాణ్ రామ్.
చితి
నందమూరి హరికృష్ణ తనయుడు నందమూరి జానకిరాం అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం ముగిశాయి. ఆతను నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
కొడాలి నాని
జానకిరాం చితివద్ద ఆయన తనయుడు చిన్నారి నందమూరి తారక రామారావు, నందమూరి హరికృష్ణ, వైసీపీ నేత కొడాలి నాని.
కల్యాణ్ రామ్
మృతి చెందిన తండ్రి జానకిరాం చితికి తనయుడు తారక రామారావు నిప్పు అంటించారు. అతనికి సహకరిస్తున్న కల్యాణ్ రామ్.