హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైద్రాబాద్‌లో కిరణ్ గర్జన, చెప్పులకే జై కొడ్తూ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం హైదరాబాదులో జై సమైక్యాంధ్ర అంటూ గర్జించారు! తెలంగాణ ప్రాంతానికి మేలు జరగదనే తాను విభజనను వ్యతిరేకించానని ఆయన చెప్పారు.

నేరేడ్ మెట్, యూసఫ్ గూడలలో ఆయన రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. హైదరాబాద్ అంటే తనకేంతో ఇష్టమని, నగరంతో తనకు విడదీయలేని బందం ఉందన్నారు.

రాష్ట్రం విడిపోతే రెండు ప్రాంతాలు తీవ్రంగా నష్టపోతాయని, తెలంగాణలోని నల్లగొండ, మహబూబ్‌నగర్‌లలో లక్షలాది ఎకరాలకు నీళ్లు అందవని ఆందోళన వ్యక్తం చేశారు. సాగు, తాగు నీటి కోసం ప్రజలు కొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు.

కిరణ్ కుమార్ రెడ్డి

కిరణ్ కుమార్ రెడ్డి

రాష్ట్రం సమైక్యంగా ఉంటే అందరికీ మనుగడ అని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కలిసి ఉంటేనే హైదరాబాద్ నగరం అభివృద్ధిలో దూసుకుపోతుందని లేకపోతే ఇబ్బందులు తప్పవన్నారు.

కిరణ్ కుమార్ రెడ్డి

కిరణ్ కుమార్ రెడ్డి

తమ పార్టీ ఎన్నికల గుర్తుగా ఉన్న పాదరక్షలు ప్రతి వారికి నిత్యజీవితంలో భాగమని, పాదరక్షలు లేకుండా ఒక్క అడుగు కూడా భయటపడదన్నారు.

కిరణ్ కుమార్ రెడ్డి

కిరణ్ కుమార్ రెడ్డి

ఇటీవల భారతీయ జనతా పార్టీ సభలో నరేంద్ర మోడీ వ్యాఖ్యానించినట్లు తల్లిని చంపి, బిడ్డను ఇచ్చినట్లుగా తెలంగాణను ఇచ్చారని అన్నారు.

కిరణ్ కుమార్ రెడ్డి

కిరణ్ కుమార్ రెడ్డి

తాను ఇక్కడే పుట్టి, ఇక్కడే చదువుకున్నానని, ఇక్కడే క్రికెట్ ఆడానని, ఇక్కడే తనకు 90 శాతం మంది స్నేహితులు ఉన్నారని అన్నారు.

కిరణ్ కుమార్ రెడ్డి

కిరణ్ కుమార్ రెడ్డి

రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని రెండు ప్రాంతాలుగా విభజించిన కాంగ్రెసుకు ఎన్నికలలో ప్రజలే సరైన గుణపాఠం చెబుతారని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

కిరణ్ కుమార్ రెడ్డి

కిరణ్ కుమార్ రెడ్డి

రాష్ట్ర ఏర్పాటు వల్ల రెండు ప్రాంతాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు. కేవలం రెండు పార్టీల రాజకీయ లబ్ధికోసం అన్నదమ్ముల్లా కలసి ఉన్న తెలుగువారిని రెండుగా విభజించారని తెలిపారు.

కిరణ్ కుమార్ రెడ్డి

కిరణ్ కుమార్ రెడ్డి

రాష్ట్ర ఏర్పాటు వల్ల నీటి సమస్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోతామన్నారు. హైదరాబాద్‌లో సెటిలర్లకు తమ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. మల్కాజిగిరి పార్లమెంట్ జెఎస్‌పి అభ్యర్థి బండి సుధాకర్ గౌడ్‌ని గెలిపించాలన్నారు.

కిరణ్ కుమార్ రెడ్డి

కిరణ్ కుమార్ రెడ్డి

జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం హైదరాబాదులో జై సమైక్యాంధ్ర అంటూ గర్జించారు! తెలంగాణ ప్రాంతానికి మేలు జరగదనే తాను విభజనను వ్యతిరేకించానని ఆయన చెప్పారు.

కిరణ్ కుమార్ రెడ్డి

కిరణ్ కుమార్ రెడ్డి

నేరేడ్ మెట్, యూసఫ్ గూడలలో ఆయన రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. హైదరాబాద్ అంటే తనకేంతో ఇష్టమని, నగరంతో తనకు విడదీయలేని బందం ఉందన్నారు.

కిరణ్ కుమార్ రెడ్డి

కిరణ్ కుమార్ రెడ్డి

రాష్ట్రం విడిపోతే రెండు ప్రాంతాలు తీవ్రంగా నష్టపోతాయని, తెలంగాణలోని నల్లగొండ, మహబూబ్‌నగర్‌లలో లక్షలాది ఎకరాలకు నీళ్లు అందవని ఆందోళన వ్యక్తం చేశారు. సాగు, తాగు నీటి కోసం ప్రజలు కొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు.

English summary
Jai Samaikyandhra Party chief Kiran Kumar Reddy road show in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X