స్కూల్లో ఆఫర్: చిన్నారి ఆడింది, లోకేష్ నవ్వు(పిక్చర్స్)
హైదరాబాద్: యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను తెలుగుదేశం పార్టీ యువ నేత నారా లోకేశ్ పరామర్శించారు. మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద పాఠశాల బస్సును రైలు ఢీకొన్న ప్రమాదంలో పలువురు విద్యార్థులు గాయపడిన విషయం తెలిసిందే. వారిని లోకేష్ పరామర్శించారు.
ఆయన వెంట పార్టీ తెలంగాణ ఎమ్మెల్యే రేవంత్ కూడా ఉన్నారు. పిల్లల కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గాయపడ్డ బాధిత కుటుంబాలకు లోకేష్ రూ.50వేల చొప్పున అందించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడారు.
బాధిత కుటుంబాలకు రూ.50వేలు ఇచ్చామన్నారు. మృతుల కుటుంబాలకు ఎల్లుండి రూ.లక్ష చొప్పున ఇస్తామన్నారు. బాధిత కుటుంబాల పిల్లలు ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో చదువుకోవడానికి అవకాశమిస్తామన్నారు. బాధిత కుటుంబాలు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు.
లోకేష్
హైదరాబాదులోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ చిన్నారిని పరామర్శిస్తున్న తెలుగుదేశం పార్టీ యువ నేత నారా లోకష్ దృశ్యం.
లోకేష్
హైదరాబాదులోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల తల్లిదండ్రులకు రూ.50వేల చెక్ అంద చేస్తున్న తెలుగుదేశం పార్టీ యువ నేత నారా లోకేష్.
లోకేష్
హైదరాబాదులోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ చిన్నారిని పరామర్శిస్తున్న తెలుగుదేశం పార్టీ యువ నేత నారా లోకష్ దృశ్యం.
లోకేష్
హైదరాబాదులోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ చిన్నారిని పరామర్శిస్తున్న తెలుగుదేశం పార్టీ యువ నేత నారా లోకష్ దృశ్యం. క్యూర్ అయిన చిరునవ్వు చిందిస్తున్న చిన్నారిని చూసి ఆనందపడుతున్న లోకేష్.
లోకేష్
మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద పాఠశాల బస్సును రైలు ఢీకొన్న ప్రమాదంలో పలువురు విద్యార్థులు గాయపడిన విషయం తెలిసిందే. బాధిత చిన్నారులను పరామర్శిస్తున్న లోకేష్.
లోకేష్
మెదక్ జిల్లా ముసాయిపేట వద్ద పాఠశాల బస్సును రైలు ఢీకొన్న ప్రమాదంలో గాయపడ్డ చిన్నారుల తల్లిదండ్రులను పరామర్శిస్తున్న లోకేష్.
లోకేష్
హైదరాబాదులోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ చిన్నారుల తల్లిదండ్రులను పరామర్శిస్తున్న తెలుగుదేశం పార్టీ యువ నేత నారా లోకష్.
లోకేష్
యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను తెలుగుదేశం పార్టీ యువ నేత నారా లోకేశ్ పరామర్శించిన లోకేష్, వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
నారా లోకేష్
యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను తెలుగుదేశం పార్టీ యువ నేత నారా లోకేశ్ సోమవారం ఉదయం పరామర్శించారు.