'బ్లడ్ మూన్': ఆలయాల మూసివేత ఇలా.. (పిక్చర్స్)
చిత్తూరు: చంద్ర గ్రహణం సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలన్నిటినీ బుధవారం మూసివేశారు. రాహుకేతువులకు నిలయంగా ఖ్యాతినొందిన శ్రీకాళహస్తిలో ఎప్పటిలాగానే గ్రహణ సమయంలోనూ ఆలయాన్ని తెరిచి ఉంచారు. ప్రజలు జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీవాయులింగేశ్వరుడిని దర్శించుకున్నారు. రాహుకేతు పూజలు చేయించుకున్నారు. గ్రహణం వీడే సమయంలో గ్రహణ కాలాభిషేకం నిర్వహించారు.
అటు శ్రీశైలంలోను గ్రహణ స్పర్శ ఉండదని ఆస్థాన సిద్ధాంతి చెప్పినందున ఆలయాన్ని తెరిచే ఉంచారు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం ఉదయం 10 నుంచి రాత్రి 8.30 గంటల వరకు మూసేశారు. గ్రహణ అనంతరం సంప్రోక్షణచేసి రాత్రి 9.30 గంటల తర్వాత సర్వదర్శనానికి భక్తులను అనుమతించారు. వేకువజామున యథావిధిగా సుప్రభాతం, తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించారు.
తర్వాత కొలువు, పంచాంగ శ్రవణం జరిగింది. అనంతరం క్యూకాంప్లెక్సులో వేచి ఉన్న 14 వేల మంది భక్తులకు దర్శనం కల్పించారు. ఆ తర్వాత క్యూలైన్లు, ఆలయాన్ని ఖాళీ చేసి శుద్ధి నిర్వహించారు. తొలుతగా బంగారువాకిలి, జయ, విజయ ద్వారం, వెండివాకిలి, చివరగా ఆలయ ముఖ ద్వారాన్ని మూసేశారు. దీంతో వైకుంఠం క్యూకాంప్లెక్సు, ఆలయ పరిసరప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. రాత్రి 9.30 గంటలకు సర్వదర్శనం ప్రారంభించి.. అర్ధరాత్రి ఏకాంత సేవ వరకు భక్తులను అనుమతించారు.
తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారు, శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వెంకన్న ఆలయం, కాణిపాకంలోని వరసిద్ధి వినాయకస్వామి, ఇతర ఆలయాలూ మూతపడ్డాయి. ఉదయం 10 గంటలకు విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయాన్నిమూసి వేశారు.
చంద్రగ్రహణం
బుధవారం చంద్ర గ్రహణం వింతగా కనిపించింది. భూమినీడలోకి చేరుకున్న గ్రహణ చంద్రుడిపై సూర్యకిరణాలు పడటంతో ఎర్రగా మెరిసిపోయాడు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 3:54 నుంచి రాత్రి 7:05 దాకా ఈ గ్రహణం ఏర్పడింది, 4:24 నుంచి 4:54 మధ్య పూర్తిస్థాయిలో ఏర్పడింది. 7:05కు ముగిసింది. కాకపోతే, ఈ గ్రహణం మన దగ్గర విడుపు సమయంలో అదీ సాయంత్రం 6 గంటల సమయంలో కేవలం నాలుగైదు నిమిషాలపాటు మాత్రమే కనిపించింది.
బిర్లా టెంపుల్ మూత
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం ఉదయం 10 నుంచి రాత్రి 8.30 గంటల వరకు మూసేశారు. గ్రహణ అనంతరం సంప్రోక్షణచేసి రాత్రి 9.30 గంటల తర్వాత సర్వదర్శనానికి భక్తులను అనుమతించారు. వేకువజామున యథావిధిగా సుప్రభాతం, తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించారు.
బిర్లా టెంపుల్ మూత ప్రకటన
తర్వాత కొలువు, పంచాంగ శ్రవణం జరిగింది. అనంతరం క్యూకాంప్లెక్సులో వేచి ఉన్న 14 వేల మంది భక్తులకు దర్శనం కల్పించారు. ఆ తర్వాత క్యూలైన్లు, ఆలయాన్ని ఖాళీ చేసి శుద్ధి నిర్వహించారు. తొలుతగా బంగారువాకిలి, జయ, విజయ ద్వారం, వెండివాకిలి, చివరగా ఆలయ ముఖ ద్వారాన్ని మూసేశారు. దీంతో వైకుంఠం క్యూకాంప్లెక్సు, ఆలయ పరిసరప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. రాత్రి 9.30 గంటలకు సర్వదర్శనం ప్రారంభించి.. అర్ధరాత్రి ఏకాంత సేవ వరకు భక్తులను అనుమతించారు.
జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్
తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారు, శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వెంకన్న ఆలయం, కాణిపాకంలోని వరసిద్ధి వినాయకస్వామి, ఇతర ఆలయాలూ మూతపడ్డాయి. ఉదయం 10 గంటలకు విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయాన్నిమూసి వేశారు. తూర్పు గోదావరి జిల్లాలోని సత్యదేవుని ప్రధానాలయ తలుపులను ఉదయం 9 గంటలకు మూసివేశారు. శ్రీకాకుళం జిల్లాలో అరసవల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగంతోపాటు పలు ఆలయాలు మూసివేశారు.
తిరుమల
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం ఉదయం 10 నుంచి రాత్రి 8.30 గంటల వరకు మూసేశారు. గ్రహణ అనంతరం సంప్రోక్షణచేసి రాత్రి 9.30 గంటల తర్వాత సర్వదర్శనానికి భక్తులను అనుమతించారు. వేకువజామున యథావిధిగా సుప్రభాతం, తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించారు.
తిరుమల
తర్వాత కొలువు, పంచాంగ శ్రవణం జరిగింది. అనంతరం క్యూకాంప్లెక్సులో వేచి ఉన్న 14 వేల మంది భక్తులకు దర్శనం కల్పించారు. ఆ తర్వాత క్యూలైన్లు, ఆలయాన్ని ఖాళీ చేసి శుద్ధి నిర్వహించారు. తొలుతగా బంగారువాకిలి, జయ, విజయ ద్వారం, వెండివాకిలి, చివరగా ఆలయ ముఖ ద్వారాన్ని మూసేశారు.
తిరుమల
దీంతో వైకుంఠం క్యూకాంప్లెక్సు, ఆలయ పరిసరప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. రాత్రి 9.30 గంటలకు సర్వదర్శనం ప్రారంభించి.. అర్ధరాత్రి ఏకాంత సేవ వరకు భక్తులను అనుమతించారు.
తిరుమల
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం ఉదయం 10 నుంచి రాత్రి 8.30 గంటల వరకు మూసేశారు. గ్రహణ అనంతరం సంప్రోక్షణచేసి రాత్రి 9.30 గంటల తర్వాత సర్వదర్శనానికి భక్తులను అనుమతించారు. వేకువజామున యథావిధిగా సుప్రభాతం, తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించారు.
తిరుమల
వైకుంఠం క్యూకాంప్లెక్సు, ఆలయ పరిసరప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. రాత్రి 9.30 గంటలకు సర్వదర్శనం ప్రారంభించి.. అర్ధరాత్రి ఏకాంత సేవ వరకు భక్తులను అనుమతించారు.
తిరుమల
విజయనగరం జిల్లాలో పైడితల్లి, రామతీర్థంలోని సీతారామ దేవస్థానం మూతపడ్డాయి. విశాఖ సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయాన్నీమూసివేశారు. తెలంగాణలోని యాదగిరిగుట్ట తదితర ఆలయాలను కూడా చంద్రగ్రహణం సందర్భంగా మూసివేశారు.