బైక్పై మంత్రి గంటా, క్షేమంగా వెళ్లి రావాలని.. (పిక్చర్స్)
విశాఖ: ట్రాఫిక్ నిబంధనలు పాటించి క్షేమంగా, సురక్షితంగా ప్రయాణించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస రావు మంగళవారం అన్నారు.
రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం బీచ్ రోడ్డులో నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు.
రోడ్డుపై వాహనాలు నడిపేటప్పుడు వ్యక్తిగత భద్రత దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. విశాఖ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో వాహనాలు పెరుగుతున్నా, ఆ మేరకు రహదారులు మాత్రం విస్తరించడం లేదన్నారు.
రోడ్డు భద్రత వారోత్సవాలు
ట్రాఫిక్ నిబంధనలు పాటించి క్షేమంగా, సురక్షితంగా ప్రయాణించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస రావు మంగళవారం అన్నారు.
రోడ్డు భద్రత వారోత్సవాలు
రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం బీచ్ రోడ్డులో నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు.
రోడ్డు భద్రత వారోత్సవాలు
రోడ్డుపై వాహనాలు నడిపేటప్పుడు వ్యక్తిగత భద్రత దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. విశాఖ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో వాహనాలు పెరుగుతున్నా, ఆ మేరకు రహదారులు మాత్రం విస్తరించడం లేదన్నారు.
రోడ్డు భద్రత వారోత్సవాలు
అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపటం లాంటి విషయాల పైన పోలీసులు కఠిన చర్యలు చేపట్టాలని గంటా శ్రీనివాస రావు సూచించారు.
రోడ్డు భద్రత వారోత్సవాలు
హెల్మెట్లు తప్పనిసరిగా ధరించాలనిసూచించారు. అతివేగం ప్రమాదకరమని హితవు పలికారు. ద్విచక్ర వాహనాంపై ర్యాలీలో గంటా శ్రీనివాస రావు పాల్గొన్నారు.
రోడ్డు భద్రత వారోత్సవాలు
ఆర్కే బీచ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ పార్కు హోటల్ జంక్షన్ వరకు సాగింది. తిరిగి ఆర్కే బీచ్కు చేరుకుంది. రవాణాశాఖ ఉప కమిషనర్ ప్రభురాజ్ కుమార్ మాట్లాడుతూ... మూడు రోజుల పాటు భద్రతా వారోత్సవాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.