చంద్రబాబు ముందే ఫీట్లు, కల్సిన అరుణ (పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ప్రముఖ యోగా శిక్షకురాలు కె అరుణ బుధవారం లేక్ వ్యూ అతిథి గృహంలో కలిశారు. చంద్రబాబుకు అభినందనలు తెలిపారు.
మరోవైపు, ఏపీ యోగా కల్చర్ అసోసియేషన్ బృందం బుధవారం లేక్ వ్యూ అతిథి గృహంలో చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసింది.
ఇటీవల నాగపూర్లో 27వ నేషనల్ యోగా ఆసనాస్ ఛాంపియన్షిప్-2014 పోటీలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా 780 మంది పాల్గొన్న ఈ పోటీల్లో ఏపీ, తెలంగాణల నుండి 40 మంది పాల్గొన్నారు.
బాబుతో అరుణ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ప్రముఖ యోగా శిక్షకురాలు కె అరుణ బుధవారం లేక్ వ్యూ అతిథి గృహంలో కలిశారు.
బాబుతో అరుణ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ప్రముఖ యోగా శిక్షకురాలు కె అరుణ బుధవారం లేక్ వ్యూ అతిథి గృహంలో కలిశారు. చంద్రబాబుకు అభినందనలు తెలిపారు.
బాబుతో అరుణ
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించాలని యోగా శిక్షకురాలు కె అరుణ ఆకాంక్షించారు.
యోగాసనం
ఆంధ్రప్రదేశ్ యోగా కల్చర్ అసోసియేషన్ బృందం బుధవారం లేక్ వ్యూ అతిథి గృహంలో చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసింది. బాబు ఎదుట యోగాసనం వేస్తు్నన బేబీ శ్రీవిద్య
యోగాసనం
ఇటీవల నాగపూర్లో 27వ నేషనల్ యోగా ఆసనాస్ ఛాంపియన్షిప్-2014 పోటీలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా 780 మంది పాల్గొన్న ఈ పోటీల్లో ఏపీ, తెలంగాణల నుండి 40 మంది పాల్గొన్నారు.
యోగాసనం
యోగా పోటీలకు వెళ్లిన 40 మంది తెలుగు రాష్ట్రాల విద్యార్థుల బృందం 17 పతకాలను సాధించింది. వీటిలో 2 బంగారు, 1 వెండి, మూడు కాంస్యాలతో పాటు.. 4, 5, 6 స్థానాలను పొందారు.
శివాజీ
రాజమండ్రికి చెందిన శవాజీ అనే యువకుడు వ్యవసాయ అభివృద్ధికి సంబంధించిన పలు పోస్టర్లను చంద్రబాబు నాయుడుకు చూపిస్తున్న దృశ్యం.
యోగాసనం
ఏపీ యోగా కల్చర్ అసోసియేషన్ అధ్యక్షురాలు స్వరాజ్యలక్ష్మి, బృందం మేనేజర్ రామరాజు, శిక్షకుడు రామకృష్ణ నేతృత్వంలో పోటీల్లో పాల్గొన్న సభ్యులు చంద్రబాబును కలిశారు.
యోగాసనం
ఏపీ యోగా కల్చర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు.
యోగాసనం
ఆంధ్రప్రదేశ్ యోగా కల్చర్ అసోసియేషన్ బృందం బుధవారం లేక్ వ్యూ అతిథి గృహంలో చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసింది. బాబు ఎదుట యోగాసనం వేస్తు్నన బేబీ శ్రీవిద్య
యోగాసనం
చిన్నారి శ్రీవిద్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎదుట యోగాసనాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆమెను, బృంద సభ్యులను అభినందించారు.
మైనార్టీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన మైనార్టీలు బుధవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు.