వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దుబాయ్ వెళ్లే ముందు శ్రీదేవికి జ్వరం, గొంతునొప్పి, అవే ఇష్టం: తమ స్నేహంపై పింకిరెడ్డి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దిగ్గజ సినీ నటి మరణం ప్రమాదవశాత్తు జరిగినదేనని దుబాయి పోలీసులు, ప్రాసిక్యూషన్ తన తుది నివేదికలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే, మొదట గుండెపోటు అని, ఆ తర్వాత మద్యం తాగిన ఆమె బ్రాత్రూం వాటర్ టబ్బులో పడి చనిపోయిందని వార్తలు వచ్చాయి. మీడియాలో కూడా అనేక కథనాలు వెలువడ్డాయి.

చివరకు దుబాయి ప్రాసిక్యూషన్ నివేదికతో శ్రీదేవి మృతిపై స్పష్టత వచ్చింది. దీంతో భారత్‌కు శ్రీదేవి పార్థీవ దేహాన్ని తీసుకెళ్లేందుకు దుబాయి పోలీసులు అనుమతిచ్చారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి వరకు ఆమె పార్థీవ దేహం ముంబైకి చేరనుంది. కాగా, ప్రముఖ సోషలైట్, ఎంపీ సుబ్బిరామిరెడ్డి కూతురు పింకిరెడ్డి శ్రీదేవికి సంబంధించిన కీలక విషయాలు వెల్లడించారు.

శ్రీదేవికి జ్వరం, గొంతునొప్పి

శ్రీదేవికి జ్వరం, గొంతునొప్పి

కాగా, శ్రీదేవి దుబాయ్‌కు వెళ్లే ముందు తనతో మాట్లాడారని, తన ఆరోగ్యం కొద్దిగా బాగుండలేదని, జ్వరం, గొంతునొప్పి ఉందని తనకు చెప్పిందని పింకిరెడ్డి తెలిపారు. అయితే, శ్రీదేవి చనిపోయిందంటే తనకు మొదట అర్థం కాలేదని, ఆ తర్వాత తన భర్తను అడిగానని చెప్పారు.

ఏడుస్తూనే బోనీకపూర్

ఏడుస్తూనే బోనీకపూర్

శ్రీదేవి మరణం నిజమేనని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని చెప్పారు. ‘ఆ తర్వాత అనిల్ కపూర్ భార్యకు ఫోన్ చేసి మాట్లాడాను. బోనీకపూర్ కు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేశారని, ఆయన ఏడుస్తూనే ఉన్నారు' అని పింకిరెడ్డి తెలిపారు. బోనీ-శ్రీదేవి జంట ఒకరంటే మరొకరికి ప్రాణమని, ఇద్దరు పిల్లలు వారి ప్రాణమని అన్నారు.

చాలా బాధించింది.. మీడియా ఇలానా..

చాలా బాధించింది.. మీడియా ఇలానా..

జాహ్నవి సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకోవడం చాలా బాధకరమని పింకిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీదేవి చనిపోయారంటే ఎలా స్పందించాలో కూడా అర్థం కావట్లేదని, ఆమె మరణించిందంటే నమ్మలేకపోతున్నానని అన్నారు. పెళ్లిలో బాగా అలసిపోవడం వల్లే, ఆమె దుబాయ్‌లోనే ఉండిపోయిందని అన్నారు. శ్రీదేవి మరణంపై వచ్చిన మీడియా కథనాలు బాధించాయని చెప్పారు.

సిద్ధి వినాయక ఆలయంలో వేదనగా, కంటతడి, తెలుగువారంటే..: ‘ఆలస్యం'పై ఫ్యాన్స్ అసహనంసిద్ధి వినాయక ఆలయంలో వేదనగా, కంటతడి, తెలుగువారంటే..: ‘ఆలస్యం'పై ఫ్యాన్స్ అసహనం

శ్రీదేవి మా ఇంటికి వస్తే.. అవంటే చాలా ఇష్టం

శ్రీదేవి మా ఇంటికి వస్తే.. అవంటే చాలా ఇష్టం

కాగా, శ్రీదేవి తమ ఇంటికి ఎప్పుడొచ్చినా చేపలు పులసు, బొమ్మిడాయిల పులుసు బాగా ఇష్టంగా తినేదని చెప్పారు. తాను ఎప్పుడైనా ముంబైలోని శ్రీదేవి నివాసానికి వెళ్లేదానినని, తామిద్దరం కలిసి బయటకు వెళ్లేవాళ్లమని, తన బాడీగార్డ్, మేనేజర్ లేకుండా ఆమె తనతో బయటకు వచ్చేవారని పింకిరెడ్డి గుర్తు చేసుకున్నారు.

చిన్నప్పట్నుంచే.. ముంబైకి వెళ్లిన తర్వాత..

చిన్నప్పట్నుంచే.. ముంబైకి వెళ్లిన తర్వాత..

శ్రీదేవి చిన్నతనంలో తమ తండ్రి ఇంటికి వచ్చేవారని, అప్పట్నుంచే తనకు ఆమె పరిచయమని పింకిరెడ్డి తెలిపారు. 15ఏళ్ల క్రితం తాము ముంబైకి వెళ్లిన తర్వాత శ్రీదేవి తమకు మరింత క్లోజ్ అయ్యారని చెప్పారు. తరచూ కలుసుకుంటూ ఉండేవారమని పింకిరెడ్డి తెలిపారు.

ముంబైకి రేపు వెళ్తాం

ముంబైకి రేపు వెళ్తాం

శ్రీదేవి మరణ విన్న వెంటనే సోమవారం ముంబైకి వెళ్లామని, ఆమె పిల్లలను కలిసి పరామర్శించామని చెప్పారు. ఆ తర్వాత తిరిగి వచ్చామని, మంగళవారం రాత్రి వరకు శ్రీదేవి పార్థీవ దేహం ముంబైకి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. బుధవారం శ్రీదేవి పార్థీవ దేహాన్ని చూసేందుకు ముంబైకి వెళ్తామని చెప్పారు.

English summary
Socialite and MP T Subbirami reddy's daughter Pinky Reddy responded on Actress Sridevi' demise.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X