కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అనుమానంతో భార్యాబిడ్డల నరికివేత: దొంగల బీభత్సం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగర శివారు ప్రాంతమైన రాజేంద్రనగర్ పరిధిలోని కిస్మత్‌పూర్ ఎన్నారై కాలనీలో పట్టపగలే దొంగలు బీభత్సం సృష్టించారు. ముఖానికి ముసుగులు ధరించిన ముగ్గురు దుండగులు కుమార్ సింగ్ అనే వ్యక్తి ఇంట్లో చొరబడి కత్తులతో దాడి కత్తులతో దాడి చేసి చోరీకి పాల్పడ్డారు. ఇంటి యజమాని భార్య మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కెళ్లారు.

అడ్డుకున్న కుమార్ సింగ్‌ను కత్తితో దాడి చేసి గాయపర్చారు. బీహార్ రాష్ట్రానికి చెందిన కుమార్ సింగ్ కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చి ఎన్నారై కాలనీలో నివాసముంటున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

Pirates wreaking havoc in the daylight

కడప జిల్లాలో దారుణం

కడప: జిల్లాలోని జమ్మలమడుగు మండలం పెద్దదండ్లూరు దారుణ ఘటన చోటు చేసుకుంది. అనుమానంతో ఓ వ్యక్తి తన భార్య, కూతురు, కొడుకుపై మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో భార్య, కూతురు అక్కడికక్కడే మృతి చెందగా.. కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి.

నిందితుడితో బాధితురాలికి 15ఏళ్ల క్రితం వివాహమైంది. కాగా, ఆమెను గత కొంతకాలంగా అనుమానంతో నిత్యం వేధింపులకు గురిచేశాడు. ఈ నేపథ్యంలో మంగళవారం భార్య, కూతురు కుమారిడిపై గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటనలో భార్య, కుమార్తె మృతి చెందగా.. కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. అతడిని చికిత్స నిమిత్తం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

English summary
Pirates created wreaking havoc in the daylight in Rajendra Nagar in Hyderabad on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X