రెండు రోజుల్లో రైతు రుణమాఫీ, మోడీ అబద్దాల కోరు : రాహుల్ గాంధి,
ఏపి ప్రజలకు మరోసారి కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధి ఎన్నికల వరాలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణమాఫి చేస్తామని హమీ ఇచ్చారు.దీంతోపాటు ప్రత్యేక హోదా ఇవ్వడానికి కాంగ్రేస్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.మరోవైపు ప్రధాని మోదీ ఆబద్దాల కోరు అంటూ ఆయన విరుచుకుపడ్డారు.
కేటీఆర్ ఎద్దా.. ? దున్నపోతా .. ? ఆయనకు కూడా తెల్వదంట !?
ప్రత్యేక హోద ఇచ్చే సత్తా కాంగ్రేసే కే ఉంది.
ఆంధ్రుల హక్కుగా ఉన్న ప్రత్యేక హోదాను అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చితీరుతామని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధి స్పష్టం చేశారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య స్టేడీయంలో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గోన్నారు. ఈ సంధర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై ప్రధాని మన్మోహన్ సింగ్ భారతదేశ పార్లమెంట్ లో స్వయంగా ప్రకటించారని అన్నారు.దీన్ని అమలు పరిచే సత్తా కాంగ్రేస్ పార్టీకి మాత్రమే ఉందని అన్నారు.
రెండు రోజుల్లో రైతు రుణమాఫి,
ఆధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రైతుల రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధి స్పష్టం చేశారు. ఈనేపథ్యంలోనే ఇటివల అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలను కేవలం మూడు రోజుల్లోనే అమలు పరిచామని గుర్తు చేశారు.దేశపంపదను కోటీశ్వరులకు పంచిన ప్రధాని మోదీ గత అయిదు సంవత్సరాల్లో రైతులకు చేసింది శూన్యమని అన్నారు.ఈనేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లోని రైతుల బాధలు,వారి ఆత్మహత్యలు తనకు తెలసుని అన్నారు.మరోవైపు రైతులకు లాభం చేకూర్చేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తామని హమీ ఇచ్చారు.
మోడీలా నేను అబద్దం ఆడను : రాహుల్
సభలో నలబై అయిదు నిమిషాలపాటు మాట్లాడిన రాహుల్ గాంధి ప్రధాని మోడి పై విరుచుపడ్డారు. అధికారంలో ఉన్న మోడీ ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రుపాయాలు వేస్తానని అన్నారని ,కాని ఒక్కరికి కూడ ఇవ్వలేదని అన్నారు.ఇక కాంగ్రేస్ పార్టీ ప్రకటించిన న్యాయ్ పథకాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు. ఈ సంధర్భంలోనే ''మోదీ వలే నేను అబద్దాలను చెప్పనని" స్పష్టం చేశారు.మోదీ అయిదు సంవత్సరాల్లో పేదలను దోచీ దేశంలోని పదిహేను మంది బడా వ్యాపారస్తులకు దోచి పెట్టాడని విమర్శించారు. వేల కోట్ల రుపాయల ప్రజల డబ్బును ,నీరవ్ మోదీ,మోహుల్ చోక్సి లాంటీ వాళ్లకు కట్టబెట్టారని ఆరోపించారు.