పీవీ చేస్తే ఇరవై ఏళ్లు పట్టిందా, శభాష్: వెంకయ్యకి ప్రధాని మోడీ కితాబు
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పైన ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. బుధవారం నాడు కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశం సందర్భంగా వెంకయ్య, ప్రధాని మోడీ మధ్య చర్చ జరిగింది. ఈ సమయంలో వెంకయ్యను మెచ్చుకున్నారు.
మంగళవారం నాడు తాను కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభుతో కలిసి నంద్యాల - ఎర్రగుంట్ల రైల్వే లైన్ను ప్రారంభించానని చెప్పారు. ఈ రైల్వే లైను ప్రాజెక్టుకు 1996లో నాటి ప్రధాని పీవీ నర్సింహా రావు శంకుస్థాపన చేశారని, కాంగ్రెస్ తన పదేళ్ల పాలనలో దీనిని పూర్తిగా విస్మరించిందన్నారు.
ఆ ప్రాజెక్టును ఎన్డీయే ప్రభుత్వం ఇప్పుడు పూర్తి చేసిందని ప్రధాని మోడీకి కేంద్రమంత్రి వెంకయ్య వివరించారు. దీంతో ప్రధాని మోడీ ఆనందించారు. వెంకయ్య మంచి పని చేశారని, పీవీ నర్సింహా రావు చేసిన రైల్వే లైన్కు కూడా 20 ఏళ్లు పట్టిందా అని వ్యాఖ్యానించారని తెలుస్తోంది.