వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మోడీ పిలుపు: తీసుకోకూడదని లెటరిచ్చిన ఎమ్మెల్యే
రాజమండ్రి: సంక్షేమ ఫలాలు పేదవారికి అందాలని, అలాంటి వాటిని డబ్బున్న వాళ్లు, ప్రజాప్రతినిధులు కూడా అనుభవిస్తున్నారని, అలాంటి వాటికి ఇక నుండి ప్రజాప్రతినిధులు దూరంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ప్రధాని పిలుపుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజమండ్రి సిటీ శాసన సభ్యుడు డాక్టర్ ఆకుల సత్యనారాయణ స్పందించారు. పేదల కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న గ్యాస్ సబ్సీడీ తాను తీసుకోకూడదని ఆయన నిర్ణయించుకొన్నారు.
అందుకోసం మంగళవారం నాడు ఉదయం భారత్ గ్యాస్ సేల్స్ మేనేజర్ లక్ష్మీనారాయణకు గ్యాస్ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కలిసి, వినతి పత్రం ఇచ్చారు. ఇకపై తనకు ఇచ్చే గ్యాస్ సబ్సీడీని ఉపసంహరించుకోవాలని రాత పూర్వకంగా తెలిపారు.
akula satyanarayana narendra modi bjp gas andhra pradesh ఆకుల సత్యనారాయణ నరేంద్ర మోడీ బీజేపీ గ్యాస్ ఆంధ్రప్రదేశ్
English summary
PM Narendra Modi call: MLA gives up LPG subsidy
Story first published: Tuesday, January 13, 2015, 13:14 [IST]