ఎల్లలుదాటిన ప్రేమ: పొన్నూరు యువకుడితో పోలాండ్ యువతి పెళ్లి
ప్రేముంటే చాలు దానికి ఏదీ అడ్డురాదు. ప్రేమకు రంగు, రూపు, దూరం, దగ్గర, కులం, మతం ఏవీ కూడా పట్టవు. తాజాగా ఎల్లలు దాటిన ప్రేమ కథ పెళ్లితో ఏకమైంది. పోలాండ్ అమ్మాయి, గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన అబ్బా
గుంటూరు: ప్రేముంటే చాలు దానికి ఏదీ అడ్డురాదు. ప్రేమకు రంగు, రూపు, దూరం, దగ్గర, కులం, మతం ఏవీ కూడా పట్టవు. తాజాగా ఎల్లలు దాటిన ప్రేమ కథ పెళ్లితో ఏకమైంది. పోలాండ్ అమ్మాయి, గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన అబ్బాయి కూడా ఈ ప్రేమలో పడి మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
ఆ వివరాల్లోకి వెళితే.. పొన్నూరు పట్టణానికి చెందిన కొప్పోలు శరత్చంద్ర ఉన్నత విద్యనభ్యసించేందుకు పోలాండ్ వెళ్లారు. అక్కడ ఎంఎస్ పూర్తి చేసి ముఖ్య పట్టణం వార్సాలో ఫ్యూచర్స్ స్టెప్ కంపెనీలో ఆరునెలల నుంచి రిక్రూట్మెంట్ ఇంఛార్జ్గా ఉద్యోగం చేస్తున్నారు.
వార్సాకు చెందిన ఆగ్నేజ్కా అనే అమ్మాయి పీహెచ్డీ చేస్తోంది. ప్రతి ఆదివారం చర్చికి వెళ్లే శరత్ చంద్రకు అక్కడ ఆగ్నేజ్యా ఏడాది కిందట పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో ఆమె ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలిపింది.
సహజంగానే భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను గౌరవించే ఆగ్రేజ్కా తల్లిదండ్రులు పెళ్లికి ఎలాంటి అడ్డూ చెప్పలేదు. మరోవైపు శరత్ చంద్ర కూడా తన తల్లిదండ్రులను ఒప్పించాడు. దీంతో ఆగ్నేజ్కా, శరత్చంద్ర వివాహానికి గ్రీన్ సిగ్నల్ పడ్డట్లయింది.
ఈ నేపత్యంలో గత శనివారం రాత్రి సజ్జా కళ్యాణ మండలంలో వీరిద్దరి పెళ్లి ఘనంగా జరిగింది. ఆగ్నేజ్కాతో పాటు ఆమె తల్లి, సోదరి కూడా భారతీయ సంప్రదాయంలో దుస్తులు ధరించారు. పెళ్లికి హాజరైన పెద్దలు ఈ ప్రేమజంటను ఆశీర్వదించారు.