వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పోలవరం పనులకు తొలగిన అడ్డంకి: కేంద్రం క్లియరెన్స్
న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్ట్ పనులకు ప్రధాన అడ్డంకి తొలగింది. పోలవరం పనుల నిలిపివేత ఆదేశాలపై ఉన్న స్టే ను మరో ఏడాదిపాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది.
ఈ మేరకు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్థన్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలతో పోలవరం పనులకు ఎలాంటి అంతరాయం తలెత్తకుండా కొనసాగనున్నాయి.
పోలవరంపై నితిన్ గడ్కరీ సమీక్ష
పోలవరం పనుల పురోగతిపై కేంద్రమంత్రి గడ్కరీ సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పునరావాసం, ఆర్థికసాయం అంశాల్లో సవరించిన అంచనాలపై ఉన్నతాధికారులతో చర్చించారు.
Recommended Video
సిఎం
చంద్రబాబు
పోలవరం
నిధుల
గురించి
గడ్కరీకి
లెటర్
ఈ సమీక్షలో జలవనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు. జులై 11న పోలవరం ప్రాజెక్టును గడ్కరీ సందర్శించనున్నారు. ఈ పర్యటనకు ముందే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై అన్ని అంశాలను అధికారులను గడ్కరీ అడిగి తెలుసుకున్నారు.
Comments
polavaram polavaram project andhra pradesh centre nitin gadkari harshavardhan పోలవరం పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ కేంద్రం నితిన్ గడ్కరీ హర్షవర్ధన్
English summary
Polavaram project gets clearance to work from Centre.
Story first published: Monday, July 9, 2018, 20:40 [IST]