వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనంతపురంలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు,రూ.21 లక్షలు స్వాధీనం

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

అనంతపురం: అనంతపురం కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న మరో ముఠా పోలీసులకు పట్టుబడింది. గతంలో అనంతపురం జిల్లా పుట్టపర్తి బెట్టింగ్ కు అడ్డాగా మారడంతో పోలీసులు నిఘా తీవ్రతరం చేశారు. దీంతో కొంతకాలం సద్దుమణిగిన బెట్టింగ్ హడావుడి ప్రస్తుతం ఐపిఎల్ జరుగుతుండటంతో మళ్లీ జోరందుకుంది.

తాజాగా అనంతపురం పట్టణంలోని సివిఆర్ హోటల్ కేంద్రంగా చేసుకొని క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ఏడుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.21లక్షలు, 13 ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరు అనంతపురం, హైదరాబాద్‌, బెంగళూరుల్లో నెట్ వర్క్ ఏర్పరుచుకొని బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. అనంతపురం కేంద్రంగా శివారెడ్డి, హైదరాబాద్ కేంద్రంగా గుమ్మడి రామాంజనేయులు, బెంగుళూరు కేంద్రంగా కత్తి ప్రసాద్ క్రికెట్ బెట్టింగ్ఆర్గనైజర్లుగావ్యవహరిస్తున్నట్లు అనంతపురం నగర డీఎస్పీ వెంకటరావు తెలిపారు.

Police Arrested Cricket Betting Gang in Anantapur

గత నెలలో అనంతపురంలో బెట్టింగ్ కు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.30 లక్షలు స్వాధీనం చేసుకున్న విషయాన్ని డిఎస్పీ గుర్తు చేశారు. కేవలం 40 రోజుల వ్యవధిలోనే క్రికెట్ బెట్టింగ్ కు సంబంధించి ఒక్క అనంతపురంలోనే అర కోటి నగదు పట్టుబడటం సంచలనం సృష్టిస్తోంది. వీరితో బెట్టింగ్ లో పాల్గొంటూ పోలీసుల దాడి గురించి తెలిసి పరారీలో ఉన్న మరికొందరి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు డిఎస్పీ వెల్లడించారు.

English summary
In a major breakthrough, the Ananthapuram police busted a cricket betting racket and arrested an Seven-member gang of bookies on Sunday night. The city police seized Rs. 21 lakhs and 13 mobile phones which were being used to carry out the betting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X