రైల్వేస్టేషన్కు బాంబు బెదిరింపు కాల్ చేసింది ఇతడే(ఫొటోలు)
హైదరాబాద్: గత ఆదివారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో బాంబు పెట్టానని ఫోన్ చేసిన నిందితుడు రాజేష్ను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... రంగారెడ్డి జిల్లా శంకర్పల్లికి చెందిన కడిగల్ల రాజేష్ కూలి పనిచేస్తున్నాడు.
మూడు రోజుల క్రితం సికింద్రాబాద్ రైల్వే కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ప్లాట్ఫాం 2, 3లలో బాంబు పెట్టానని, కాసేపట్లో అది పేలుతుందని ఫోన్ చేసి పెట్టేశాడు. దీంతో ఆందోళన చెందిన పోలీసులు హుటాహుటిన డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ బృందాలతో స్టేషన్లో తనిఖీలు చేపట్టారు.
ఎక్కడా బాంబు కనిపించకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు రాజేష్ను బుధవారం అరెస్టు చేశారు. ఈ విధమైన ఫోన్ కాల్ ఎందుకు చేశావని ప్రశ్నించగా.. టైం పాస్ కోసమే తాను బాంబు బెదిరింపు ఫోన్ చేశానని రాజేష్ చెప్పడం కొసమెరుపు.