బోండా ఉమాపై కేసు, పోలీసు సిబ్బందిపై దౌర్జన్యం, విధులకు ఆటంకం కలిగించారని ఎఫ్ఐఆర్..
అమరావతి రాజధాని మార్పుపై ఏపీలో ఆందోళనలు మిన్నంటాయి. 29 గ్రామాల రైతుల ఆందోళనకు రాజకీయ పార్టీలు, జేఏసీ, ప్రజాసంఘాలు మద్దతు పలికాయి. బుధవారం మందడం, బెంజ్ సర్కిల్ వద్ద ఉద్రిక్త పరిస్థి నెలకొనగా.. గురువారం టీడీపీ నేతపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని పేర్కొన్నారు.
రాజధాని రైతుల కోసం గురువారం బోండా ఉమ తన ఇంటి నుంచి బయలుదేరారు. అయితే ఆ సమయంలో ముందుజాగ్రత్త చర్యగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులు, బోండా ఉమా మధ్య వాగ్వివాదానికి తీవ్రస్థాయికి చేరింది. తర్వాత గొడవ సద్దుమణిగి.. ఎక్కడివారు అక్కడికి వెళ్లిపోయారు.
అయితే పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై టీడీపీ నేత బోండా ఉమాపై పోలీసులు కేసు నమోదు చేశారు. మాచవరం పోలీసు స్టేషన్లో కేసు కట్టారు. ఎస్సై అర్జున్, పోలీసు సిబ్బందిపై దౌర్జన్యం చేశారని.. విధులకు ఆటంకం కలిగించారనే అభియోగాలపై కేసు నమోదు చేశారు.