వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బోండా ఉమాపై కేసు, పోలీసు సిబ్బందిపై దౌర్జన్యం, విధులకు ఆటంకం కలిగించారని ఎఫ్ఐఆర్..

|
Google Oneindia TeluguNews

అమరావతి రాజధాని మార్పుపై ఏపీలో ఆందోళనలు మిన్నంటాయి. 29 గ్రామాల రైతుల ఆందోళనకు రాజకీయ పార్టీలు, జేఏసీ, ప్రజాసంఘాలు మద్దతు పలికాయి. బుధవారం మందడం, బెంజ్ సర్కిల్ వద్ద ఉద్రిక్త పరిస్థి నెలకొనగా.. గురువారం టీడీపీ నేతపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని పేర్కొన్నారు.

police file case against tdp leader bonda uma

రాజధాని రైతుల కోసం గురువారం బోండా ఉమ తన ఇంటి నుంచి బయలుదేరారు. అయితే ఆ సమయంలో ముందుజాగ్రత్త చర్యగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులు, బోండా ఉమా మధ్య వాగ్వివాదానికి తీవ్రస్థాయికి చేరింది. తర్వాత గొడవ సద్దుమణిగి.. ఎక్కడివారు అక్కడికి వెళ్లిపోయారు.

అయితే పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై టీడీపీ నేత బోండా ఉమాపై పోలీసులు కేసు నమోదు చేశారు. మాచవరం పోలీసు స్టేషన్‌లో కేసు కట్టారు. ఎస్సై అర్జున్, పోలీసు సిబ్బందిపై దౌర్జన్యం చేశారని.. విధులకు ఆటంకం కలిగించారనే అభియోగాలపై కేసు నమోదు చేశారు.

English summary
police file case against tdp leader bonda uma.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X