పెళ్లి పేరుతో రెండుసార్లు అనుభవించాడు, చిన్నారికి టీచర్ నీలిచిత్రాలు
రాజమండ్రి: మూడేళ్ల నుండి ప్రేమిస్తున్నానని చెప్పి శారీరక సంబంధం పెట్టుకొని వంచించిన యువకిడి పైన ఓ బాధితురాలి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కొత్తపేట శివారు ఏనుగుల మహల్కు చెందిన 14 ఏళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన 21 ఏళ్ల యువకుడు ప్రేమిస్తున్నానని చెప్పి మూడేళ్లుగా వెంటపడుతున్నాడు.
నెల కిందట బాలికను ఇంటికి రమ్మని శారీరకంగా అనుభవించాడని, ఈ నెల 9వ తేదీన రెండోసారి అనుభవించినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలు తల్లిదండ్రులు ఆమెను పెళ్లి చేసుకోవాలని అడగ్గా... నిరాకరించాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
యూకేజీ బాలికకు నీలి చిత్రాలు చూపించారు
తూర్పు గోదావరి జిల్లాలో ఓ ప్రయివేటు పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు ఆరేళ్ల బాలికకు నీలి చిత్రాలు చూపించి, అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు పాఠశాలలో ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఏడు నెలల క్రితం శ్రీనివాస రావు అనే వ్యక్తి స్థానికంగా కాన్వెంటును ఏర్పాటు చేశాడు.
కేరళ టీచర్లతో విద్యాబోధన అంటూ ప్రచారం చేశాడు. దీంతో చాలామంది పిల్లల్ని చేర్పించారు. అయితే, శ్రీనివాస రావు తన ఫోన్లో ఓ బాలికకు నీలి చిత్రాలు చూపించాడు. ఈ విషయాన్ని ఆమె తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో అతనిని చితక్కొట్టి, ఫర్నీచర్ ధ్వంసం చేశారు.