వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసెంబ్లీ వ‌ద్ద భారీగా పోలీసుల మొహ‌రింపు: ఎప్పుడూ లేని విధంగా: అమ‌రావ‌తిలో ఏం జ‌రుగుతోంది...!

|
Google Oneindia TeluguNews

ఏపీలో ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత తొలి సారి 144 సెక్ష‌న్ విధించారు. ఏపీ అసెంబ్లీ వ‌ద్ద భారీ భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేసారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లోకి వ‌స్తున్న ప్ర‌తీ ఒక్క‌రినీ త‌నిఖీ చేస్తున్నారు. గుర్తింపు కార్డు లేని వారిని అనుమ‌తించ‌ట లేదు. ఈ రోజు శాస‌న‌స‌భ‌లో ప్ర‌వేశాల పైన ఆంక్ష‌లు విధించారు. ఇదే స‌మ‌యంలో ఈ రోజుతో ఏపీ శాస‌న‌స‌భా బ‌డ్జెట్ స‌మావేశాలు ముగియ‌నున్నాయి. స‌భ‌లో కాగ్ నివేదిక ప్ర‌వేశ పెట్ట‌నున్నారు. అసెంబ్లీ వ‌ద్ద ఇంత భారీ స్థాయిలో బ‌ల‌గాల మొహ‌రింపు వెనుక అస‌లు కార‌ణం ఏంటంటే..

Recommended Video

బీసీల కోసం 139 కార్పొరేషన్లు

ఛ‌లో అసెంబ్లీకి ఎమ్మార్పీఎస్ పిలుపు
నేడు ఏపీ అసెంబ్లీ ముట్టడికి ఎమ్మార్పీఎస్‌ పిలుపునిచ్చింది. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమన్న సీఎం జగన్‌ వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేయనున్నారు. జగన్‌ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఎమ్మార్పీఎస్‌ డిమాండ్‌. ఎమ్మార్పీఎస్‌ నేతలు నిరసన నేపథ్యంలో అసెంబ్లీ, రాజధాని ప్రాంతంలో పోలీసులు 144 సెక్షన్‌ అమలు చేశారు. కొద్ది రోజులుగా ఏపీలో మంద కృష్ణ మాదిగ ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణకు మ‌ద్దుగా అనేక వ్యాఖ్య‌లు చేసారు. గ‌తంలో చంద్ర‌బాబు వ్య‌వహ‌రించిన విధంగానే ఇప్పుడు జ‌గ‌న్ తీరు ఉందంటూ ఆరోపిస్తున్నారు. మంద కృష్ణ మాదిగ ఛ‌లో అసెంబ్లీ పిలుపు కు వ్య‌తిరేకంగా అనేక మంది ఇత‌ర నేత‌లు వ్యాఖ్య‌లు చేసారు. అయితే, పోలీసు అధికారులు మాత్రం ఎవ‌రైనా అసెంబ్లీ జ‌రుగుతున్న స‌మ‌యంలో ఆటంకాలు సృష్టించాల‌ని ప్ర‌య‌త్నిస్తే స‌హించేది లేద‌ని స్ప‌ష్టం చేసారు. దీంతో.. అసెంబ్లీ ప‌రిస‌ర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బ‌ల‌గాల‌ను మొహ‌రించారు.

Police forces hugely deployed at AP Assembly. MRPS call for Chalo Assembly

నేడు స‌భ ముందుకు కాగ్ నివేదిక‌..
ఏపీ శాస‌న‌స‌భా అసెంబ్లీ స‌మావేశాలు ఈ రోజుతో ముగుస్తున్నాయి. గ‌త నెల 11వ తేదీన ప్రారంభించిన ఈ స‌మావేశాల్లో 12వ తేదీన బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్టారు. ఇప్ప‌టికే ద్ర‌వ్య వినిమ‌య బిల్లును సైతం స‌భ ఆమోదించింది. దీంతో.. ఈ రోజు ప్రశ్నోత్తరాలకు ఎక్కువ సమయం కేటాయించనున్నారు. ముఖ్యంగా అన్న క్యాంటీన్‌ల మూసివేత, నిరుద్యోగ భృతి, విజయవాడ నుంచి విమాన సర్వీసుల నిలిపివేత, అమరావతిలో మంత్రులు, అధికారుల క్వార్టర్ల నిర్మాణం పురోగతిపై టీడీపీ సభ్యులు ప్రశ్నలు లేవనెత్తనున్నారు. మరోవైపు ఫైబర్‌గ్రిడ్‌లో అక్రమాలు, ఖరీఫ్‌లో విత్తనాల కొరత, వైద్య కళాశాలల్లో ఫీజులు, వ్యవసాయ రుణాలమాఫీపై వైసీపీ సభ్యుల ప్రశ్నలు లేవనెత్తనున్నారు. దీంతో పాటుగా 2017-18 కాలానికి సంబంధించిన కాగ్ నివేదిక‌ను స‌భ‌లో ఆర్దిక మంత్రి బుగ్గ‌న ప్ర‌వేశ పెట్ట‌నున్నారు.

English summary
Police forces hugely deployed at AP Assembly. MRPS call for Chalo Assembly on demanding Cm should with draw his comments against SC's categorization.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X