ఒబామాకు ‘ఏపీ బ్రాండ్ అంబాసిడర్’ పూనమ్ కౌర్ ప్రత్యేక కానుక
హైదరాబాద్: టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ శుక్రవారం అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాను కలిశారు. భారత్ పర్యటనలో భాగంగా ఆయన శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇంటర్నెట్తో నాశనమే: మోడీపై ఒబామా ప్రశంసలు, 'పప్పు అంటే ఇష్టం'
ప్రత్యేక కానుక
ఈ సందర్భంగా పూనమ్.. బరాక్ ఒబామాను కలిసి చేనేత వస్త్రాలను బహుమతిగా అందించారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను పూనమ్ తన ట్విట్టర్, ఫేస్బుక్ ఖాతాల్లో పోస్ట్ చేశారు.
ఉత్తమమైన ఘట్టం.. ఎంతో సంతోషం
తన జీవితంలో ఇది ఉత్తమ ఘట్టమని పూనమ్ పేర్కొన్నారు. తాను ఆదర్శంగా భావించే వ్యక్తి బరాక్ ఒబామా అని.. ఆయనకు చేనేత వస్త్రాలు కానుకగా ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. వీటిని ఆయన సతీమణి మిషెల్ కోసం ఇచ్చినట్లు చెప్పారు.
ఏపీకి బ్రాండ్ అంబాసిడర్
కాగా, ఆంధ్రప్రదేశ్ చేనేత ప్రచారకర్తగా నటి పూనమ్ కౌర్ బాధ్యతలు నిర్వర్తించనున్నారని ఇటీవల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే.
తెలంగాణకు సమంత
ఈ నేపథ్యంలో మాజీ మిస్ ఆంధ్రా అయిన పూనమ్ కౌర్.. ఒబామాకు చేనేత వస్త్రాలు ఏపీ తరపున కానుకగా ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్గా ప్రముఖ నటి సమంత వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.