అన్న పట్టుకుంటే.. తమ్ముడు తలను నరికాడు...! మణిక్రాంతి హత్యకేసులో కొత్త ట్విస్ట్...
విజయవాడలోని సత్యనారయణ పురం శ్రీనగర్ కాలనీలో భర్త చేతిలో దారుణంగా హత్యకు గురైన మణికాంత్రి హత్యకేసులో మరో ట్విస్టు బయటపడింది. మణిక్రాంతిని హత్య చేసి తలను వేరు చేయడంలో నిందితుడు ప్రదీప్ అన్నతో తో పాటు మరోకరు సహకరించారని తెలుస్తోంది. ఇద్దరు ఆమేను గట్టిగా కదలకుండా పట్టుకోగా ప్రదీప్ ఆమే తలను నరికాడని తెలుస్తోంది. అనంతరం ప్రదీప్ సోదరుడితోపాటు మరోకరు బైక్పై పారిపోయారని, ఆ తర్వాతే ప్రదీప్ తలను కవర్లో చుట్టుకుని బయటకు వచ్చాడని సమాచారం.
ఎంత కిరాతకుడైన ఒక్కడే చంపి తలను వేరు చేయడం అసాధ్యం. మణిక్రాంతి హత్య విషయంలో పోలీసులు అదే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ముఖ్యంగా తలను వేరు చేసి బుడమేరులో పడవేయడంతో,న్యాయపరంగా చిక్కులు ఎదురయ్యో అవకాశాలు ఉన్నాయి. కాగా కసితో భార్యను చంపిన ప్రదీప్ పక్కా ప్లాన్తోనే తల దొరక కుండా వ్వవహరించినట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే తలను వేరు చేసిన ప్రదీప్ పారుతున్న నదిలో విసిరివేశాడు. దీంతో తల లేకుండానే మొండెంతో మణిక్రాంతి శవానికి దహన సంస్కరాలు నిర్వహించారు. మరోవైపు పోలీసులు మణిక్రాంతి తల కోసం బుడమేరులో వెతుకుతున్నారు.
అయితే కేసును సీరియస్గా తీసుకున్న పోలీసుల పక్కా ఆధారాల కోసం దర్యాప్తు చేస్తున్నారు. ఓవైపు తల కోసం వెతుకుతూనే..మరోవైపు నిందితుడికి ఎవరైన సహకరించారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే మణిక్రాంతిని హత్య చేయడంలో మరో ఇద్దరి పాత్ర ఉన్నట్టు తేల్చారు. ప్రదీప్ అన్నతో పాటు మరో వ్యక్తి అందుకు హత్యకు సహకరించారని, ఇద్దరు మణిక్రాంతిని గట్టిగా పట్టుకొన్న అనంతరం ఆమే తలను నరికాడని పోలీసులు తేల్చారు. దీంతో తల లేకున్నా మిగతా ఇద్దరు నిందితుల సాక్ష్యాలతో నిందితులకు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి.