వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలవరం పర్యటనలో అపశృతులు: పల్టీలు కొట్టిన మంత్రి కాన్వాయ్ కారు, దిగబడిన బస్సు

|
Google Oneindia TeluguNews

పశ్చిమగోదావరి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటనలో అపశృతులు చోటు చేసుకున్నాయి. బుధవారం చంద్రబాబు తన కుటుంబసభ్యులు, ప్రజాప్రతినిధులతో కలిసి పోలవరం ప్రాజెక్టును సందర్శించిన విషయం తెలిసిందే.

<strong>చారిత్రక ఘట్టం, ఎంతో ఆనందం: పోలవరం గ్యాలరీ వాక్‌లో చంద్రబాబు ఫ్యామిలీ</strong>చారిత్రక ఘట్టం, ఎంతో ఆనందం: పోలవరం గ్యాలరీ వాక్‌లో చంద్రబాబు ఫ్యామిలీ

కాగా, ఈ పర్యటనలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కాన్వాయ్‌లోని కారు బోల్తాపడింది. వర్షం కారణంగా కారు టైర్లు జారడంతో కారు పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో కారు కొండవైపునకు పడటంతో ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో పలువురు టీడీపీ నేతలకు చిన్నపాటి గాయాలయ్యాయి.

prathipati pulla rao convoy car met accident at polavaram

ఇది ఇలా ఉంటే.. విజయవాడ నుంచి పోలవరం సందర్శనకు బయలుదేరిన టీడీపీ ఎమ్మెల్యేలకు ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న బస్సు ఏలూరు సమీపంలోకి రాగానే రోడ్డు పక్కన ఉన్న మట్టిలో దిగబడిపోయింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదు.

prathipati pulla rao convoy car met accident at polavaram

ఎంతసేపు ప్రయత్నించినా బస్సు ముందుకు కదలకపోవడంతో బస్సులోని 35మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వేరే వాహనాల్లో పోలవరానికి తరలించారు.

English summary
Andhra Pradesh minister Prathipati Pulla Rao convoy car met accident at polavaram on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X