హత్యా రాజకీయాలు: జగన్పై పుల్లారావు, ధూళిపాళ్ల ఫైర్
ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని జగన్ హత్యా రాజకీయాలతో రాష్ట్రంలో అలజడి రేపేందుకు ప్రయత్నిస్తున్నారని పుల్లారావు మండిపడ్డారు. బెల్లంకొండ మండలం పాపాయపాలెంలో తెలుగుదేశం నేత సింగారెడ్డి వెంకట్రామి రెడ్డిని వేటకొడవళ్లతో నరికి చంపడం దారుణమని అన్నారు.
టిడిపి విజయంలో వెంకట్రామిరెడ్డి కీలక పాత్ర పోషించారనే కక్షతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన్ని హత్య చేశారని అన్నారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ.. ఇటీవల కృష్ణా జిల్లాలో ముఠా కక్షల్లో మృతి చెందిన వ్యక్తి మరణాన్ని టిడిపిక ఆపాదించి లబ్ధి పొందేందుకు జగన్ ప్రయత్నించారని విమర్శించారు.
వైయస్
జగన్
కుటుంబం
అంతా
నేరమయమని
పెదకూరపాడు
ఎమ్మెల్యే
కొమ్మాలపాటి
శ్రీధర్
ఆరోపించారు.
మీడియా
సమావేశంలో
మంత్రి
పుల్లారావు
వెంట
ఎమ్మెల్యే
నక్కా
ఆనందబాబు,
రాష్ట్ర
పార్టీ
కార్యదర్శి
మన్నవ
సుబ్బారావు
తదితరులు
పాల్గొన్నారు.