వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుకు జైళ్ల శాఖాధికారుల షాక్ .. అచ్చెన్నాయుడిని కలవటానికి నో పర్మిషన్

|
Google Oneindia TeluguNews

ఏపీ జైళ్ల శాఖ అధికారులు చంద్రబాబు నాయుడుకి షాక్ ఇచ్చారు.ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్టయిన తమ పార్టీ నేత అచ్చెన్నాయుడుని పరామర్శించడానికి అనుమతించాలని కోరిన బాబుకు అనుమతి నిరాకరించారు. ఈఎస్ఐ స్కామ్ లో అరెస్టయిన టిడిపి ఎమ్మెల్యే, టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు అనారోగ్య కారణంగా గుంటూరు జిజిహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

 అచ్చెన్నాయుడు రిమాండ్ రిపోర్ట్ లో ఏముంది ? ఏసీబీ చెప్పిందేంటి ? అచ్చెన్నాయుడు రిమాండ్ రిపోర్ట్ లో ఏముంది ? ఏసీబీ చెప్పిందేంటి ?

 అచ్చెన్నను పరామర్శించాలనుకున్న బాబుకు జైళ్ళ శాఖ షాక్

అచ్చెన్నను పరామర్శించాలనుకున్న బాబుకు జైళ్ళ శాఖ షాక్

అనారోగ్యంతో బాధపడుతున్న అచ్చెన్నను పరామర్శించాలి, ఆయనకు ధైర్యం చెప్పాలి అనుకున్న చంద్రబాబు జైళ్ళశాఖ అధికారులకు అనుమతి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
అయితే కోవిడ్ నిబంధనల ప్రకారం అనుమతి ఇవ్వలేమని తేల్చిచెప్పింది జైళ్ళ శాఖ. గత రెండు నెలలుగా ఎవరికీ అనుమతి ఇవ్వడం లేదంటూ జైళ్ల శాఖ అధికారులు చంద్రబాబుకు తేల్చిచెప్పారు. కరోనా బూచిని చూపించి పర్మీషన్ కు నో అన్నారు .

మేజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాలన్న ఆస్పత్రి సూపరిండెంట్

మేజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాలన్న ఆస్పత్రి సూపరిండెంట్

ఇక మరో మార్గంగా గుంటూరు జిజిహెచ్ ఆసుపత్రి సూపరిండెంట్ ను టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని కలవటానికి అనుమతించాల్సిందిగా చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఇక అక్కడ కూడా మాజీ సీఎం కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన రిమాండ్ లో ఉన్నారని మెజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాలని,అలా కాకుంటే కలవడానికి వీలు లేదని సూపరిండెంట్ సమాధానమిచ్చారు. ఒక చంద్రబాబు నాయుడుకే కాదు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు సైతం అధికారులు అనుమతి నిరాకరించారు.

అచ్చెన్న అరెస్ట్ విషయంలో ఇంకా ఆగ్రహ జ్వాలలు

అచ్చెన్న అరెస్ట్ విషయంలో ఇంకా ఆగ్రహ జ్వాలలు

అచ్చెన్నాయుడును పరామర్శించటానికి కూడా అవకాశం లేకపోవడంతో చంద్రబాబు తీవ్ర అసహనంతో ఉన్నారు. ఇక ఈఎస్ఐ స్కాం లో వైసీపీ కావాలని అచ్చెన్నాయుడిని ఇరికించింది అని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ప్రపంచ ఆర్థిక నేరస్థుల లిస్టులో ఉన్నాడని , ఆర్ధిక నేరస్తుడికి అధికారం అప్పగిస్తే ప్రతి ఒక్కరూ నేరగాళ్లు లాగా కనిపిస్తారని అందుకే అచ్చెన్నాయుడును అరెస్ట్ చేశారని మండిపడుతున్నారు . టెర్రరిస్టును పట్టుకున్నట్లుగా అన్యాయంగా అక్రమంగా అరెస్టు చేశారని మండిపడుతున్నారు .

టీడీపీ నేతలు ఏం అన్నా అనుకున్నదే చేస్తున్న సర్కార్

టీడీపీ నేతలు ఏం అన్నా అనుకున్నదే చేస్తున్న సర్కార్

ఏపీ సీఎం జగన్ బెదిరింపులకు, ప్రలోభాలకు లొంగితే వారికి పార్టీ కండువా కప్పుతారని , లేదంటే జైలు అన్నట్టు వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు . రాష్ట్రంలో అమలు చేస్తున్న రాజారెడ్డి రాజ్యాంగానికి జగనే బాధ్యత వహించాలని ఆయన పేర్కొన్నారు . నిన్న అచ్చెన్న.. నేడు జేసీ ప్రభాకర్ రెడ్డి అస్మిత్ రెడ్డిల అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపు చర్య అంటూ ఆయన మండిపడ్డారు. ఏది ఏమైనా టీడీపీ నేతలు ఎంతగా మాటల దాడి చేసినా ప్రభుతం మాత్రం తన పని తాను చేసుకుపోతుంది. ఇక ఈ వ్యవహారంలో అన్ని ఆధారాలు ఉంటేనే అరెస్ట్ చేశామని ఏసీబీ జేడీ పేర్కొనటం ముఖ్యమైన విషయం .

English summary
AP Prisons Department officials shocked Chandrababu Naidu. TDP MLA TDLP deputy atchannaidu arrested in ESI scam, is being treated at Guntur GGH hospital due to illness. Chandrababu wants to meet and console him but the prisons department and hospital superintendent did not give the permission .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X