పులివెందులలో జగన్కు చెక్ చెప్పేలా ప్లాన్: టీడీపీలోకి రెడ్డి బ్రదర్స్, అందుకే
పులివెందుల: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులపై తెలుగుదేశం పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కడపలో టీడీపీ విజయం సాధించింది.
రాజకీయాల్లోకి నో, అందుకే పుస్తకం, పదవిలో ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదంటే: అజేయ కళ్ళం
అప్పటి నుంచి టీడీపీ నేతలు మాట్లాడుతూ.. వచ్చే 2019 ఎన్నికల్లో పులివెందులలో జగన్ను ఓడిస్తామని చెబుతున్నారు. చంద్రబాబు కూడా పులివెందులపై ప్రత్యేక దృష్టి సారించారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఎలాగైనా చెక్ పెట్టాలని భావిస్తున్నారు.
పులివెందులలో పట్టు పెంచుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ఆపరేషన్ ఆకర్ష్ పైన దృష్టి సారించారు. గురువారం పులివెందులలోని బలపనూరుకు చెందిన శ్రీనాథ్ రెడ్డి, నారాయణ రెడ్డి సోదరులు టీడీపీలో చేరారు.
టీడీపీ నేతలు బీటెక్ రవి, సతీష్ రెడ్డి తదితరుల సమక్షంలో వారు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. శ్రీనాథ్ రెడ్డి, నారాయణ రెడ్డిలకు బీటెక్ రవి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీలోకి ఎవరు వచ్చినా స్వాగతిస్తామని బీటెక్ రవి చెప్పారు.
కాగాక, శ్రీనాథ్ రెడ్డి, నారాయణ రెడ్డిలు వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచే ఆ కుటుంబానికి సన్నిహితులు. అయితే పార్టీ విధానాలు, నిర్ణయాల పట్ల అసంతృప్తితో వారు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.