ఎన్టీఆర్ జయంతి: పురంధేశ్వరి నోట హరికృష్ణ మాట, కేక్ కట్ చేసిన బాబు
స్వర్గీయ నందమూరి తారక రామారావు పథకాలే ఇప్పటికీ కొనసాగుతున్నాయని బిజెపి నాయకురాలు, మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరి ఆదివారం అన్నారు.
అమరావతి: స్వర్గీయ నందమూరి తారక రామారావు పథకాలే ఇప్పటికీ కొనసాగుతున్నాయని బిజెపి నాయకురాలు, మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరి ఆదివారం అన్నారు.
అంతకుముందు, ఆమె సోదరుడు, టిడిపి నేత హరికృష్ణ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ పథకాలనే అందరు కాపీ కొట్టారని, వాటికి కొత్త పథకాలని కలరింగ్ ఇస్తున్నారని అభిప్రాయపడ్డారు. పురంధేశ్వరి కూడా ఎన్టీఆర్ పథకాలే కొనసాగుతున్నాయని చెప్పారు.
హరికృష్ణ ఆసక్తికరం, చంద్రబాబుపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకు పురంధేశ్వరి నివాళులు అర్పించారు. అనంతరం పైవిధంగా మాట్లాడారు.
విశాఖలో చంద్రబాబు ఎన్టీఆర్ జయంతిని జరుపుకున్నారు. ఆయన కేక్ కట్ చేశారు. నేతలు చంద్రబాబుకు కేక్ తినిపించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. తెలుగు జాతికి ఇది ఒక పండుగ అన్నారు. ఒక యుగపురుషుడు పుట్టిన రోజు అని, ఆయన జన్మదినాన్ని మమహానాడు సందర్భంగా జరుపుకుంటున్నామన్నారు.