అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వారిని వారే కించపర్చుకుంటున్నారు: అవార్డులు తిరిగిచ్చేయడంపై పురంధేశ్వరి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి బలం క్రమంగా పెరుగుతోందని ఆ పార్టీ నాయకురాలు, మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరి అన్నారు. విజయవాడలో జరిగిన పార్టీ మైనార్టీ మోర్చా సమావేశంలో ఆమె సోమవారం పాల్గొన్నారు.

Purandeswari speaks about bjp membership registration at vijayawada

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏపీలో పార్టీ సభ్యత్వ నమోదు 23 లక్షలకు చేరుకుందని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని అన్నారు. అలా చేస్తే కేంద్ర మరిన్ని నిధులు ఇచ్చే అవకాశం ఉందన్నారు.

కాగా, దేశ వ్యాప్తంగా పలువురు సాహితీవేత్తలు తమ అవార్డులను తిరిగిచ్చేయడం మంచి పద్ధతి కాదని, వారిని వారే కించపర్చుకునేలా సాహితీవేత్తల తీరు ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.

తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో శిశువు మాయం

తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన శిశువు మాయమైన సంఘటన సంచలం సృష్టించింది. బంధువు అని చెప్పి గుర్తు తెలియని ఓ మహిళ శిశువును అపహరించుకు వెళ్లింది.

దీంతో శిశువ తల్లి ఫిర్యాదు మేరకు అక్కడి చేరుకున్న అలిపిరి పోలీసులు ఆసుపత్రి సిబ్బందితో పాటు, అక్కడున్న వారిని విచారిస్తున్నారు.

English summary
Purandeswari speaks about bjp membership registration at vijayawada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X