వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భార్య సమాధి వద్ద గుండె పోటుతో కుప్ప కూలిన పల్లె రఘునాధరెడ్డి

|
Google Oneindia TeluguNews

అసలే ఎండాకాలం కావటంతో ఎన్నికల ప్రచారం చేసి అలసిపోయిన నాయకులు కొందరు అనారోగ్యానికి గురయ్యారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పల్లె రఘునాథరెడ్డి ఎన్నికల ప్రచారం తర్వాత భార్య సమాధి దగ్గరకు వెళ్లి అక్కడే గుండెపోటుతో కుప్పకూలిపోయారు. గుండెపోటుకు గురైన ఆయనను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. భార్య సమాధి వద్ద బుధవారం సాయంత్రం పల్లె రఘునాథ రెడ్డి టెంకాయ కొట్టారు. ఆ తర్వాత గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఏపీ ఫ్యాక్ట్స్ : అభ్యర్థుల్లో ఒక పార్టీలో ధనవంతులు, మరో పార్టీలో క్రిమినల్ కేసులున్నవారు ఎక్కువ!ఏపీ ఫ్యాక్ట్స్ : అభ్యర్థుల్లో ఒక పార్టీలో ధనవంతులు, మరో పార్టీలో క్రిమినల్ కేసులున్నవారు ఎక్కువ!

ఎన్నికల టెన్షన్ , అలాగే పోలింగ్ సమయం దగ్గర పడుతుంది కాబట్టి ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో అన్న టెన్షన్ వెరసి ఆయన అనారోగ్యానికి గురయ్యారు. అయితే పల్లె రఘునాథ రెడ్డి ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు అంటున్నారు. గత రెండు రోజులుగా నిద్ర, అన్నపానీయాలు సరిగా లేకపోవడం వల్ల అనారోగ్యానికి గురయ్యారని , ఆయనకు గుండెపోటు వచ్చి ఉంటుందని అంటున్నారు. ఆయన భార్య సమాధి వద్దకు వచ్చేటప్పుడే ఆయన కాస్త అసౌకర్యంగా కనిపించారు. అయితే కొబ్బరి కాయ కొట్టిన వెంటనే ఆయన కుప్పకూలిపోయారు.

Puttaparthi TDP candidate Palle Raghunath reddy collapsed before late wifes grave
English summary
A day before tha state is set to go to polls , telugu desham party leader Palle Raghunath reddy was rushed to the hospital after he collapsed here. Reddy who is TDP's candidate from puttaparthi assembly had visited a burial ground here to pay tributes to his late wife , where he collapsed with heart attack on Wednesday .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X