పివిపి వ్యాఖ్యల కలకలం : జగన్ కు కొత్త ఇబ్బందులు : టార్గెట్ చేసిన టిడిపి..!
Recommended Video
వైసిపి నుండి విజయవాడ లోక్సభ అభ్యర్దిగా బరిలో ఉన్న పొట్లూరి వర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ప్రత్యేక హోదా పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ప్రచారం వేళ..వైసిపి అధినేత జగన్ కు ఇబ్బందిగా మారుతున్నాయి. ఈ వ్యాఖ్యల పై ముఖ్యమంత్రి చంద్రబాబు మొదలు టిడిపి నేతలు ఫైర్ అవుతున్నారు. వైసిపి అసలు స్వరూపం బయట పడిందని విమర్శిస్తున్నారు.
పివిపి వ్యాఖ్యల కలకలం..
విజయవాడ వైసిపి లోక్సభ అభ్యర్ది పివిపి ప్రత్యేక హోదా పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం సృష్టిస్తున్నాయి. టిడిపి నేతలకు అస్త్రంగా మారాయి. హోదా బోరింగ్ సబ్జెక్ట్ అంటూ విజయవాడ లోక్సభ వైసీపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) చేసిన వ్యాఖ్యలు రెండు పార్టీల మధ్య దుమారం రేపుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండి యన్ ఇండస్ట్రీస్(సీఐఐ) రాష్ట్ర విభాగం ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో విజయవాడలో సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వైసీపీ, జనసేన, సీపీఐ, సీపీఎం పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. సీఐఐ రాష్ట్ర విభాగం చైర్మన్ విజయ్ నాయుడు గల్లా నేతృత్వంలో జరిగిన ఈ భేటీకి వైసీపీ తరఫున పీవీపీ వచ్చారు. ఆయన ప్రసంగి స్తూ.. ప్రత్యేక హోదా అంశం ఓ బోరింగ్ సబ్జెక్ట్ అని, దానిపై తానేమీ మాట్లాడదలచుకోలేదని వ్యాఖ్యానించారు. సమావే శానికి హాజరైన వారు బిత్తరపోయారు. ఆయన వ్యాఖ్యలు కొద్దిసేపటికే సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఇప్పుడు ఈ వ్యాఖ్యలను టిడిపి నేతలు విమర్శిస్తూ మొత్తంగా వైసిపిని ఆత్మరక్షణలోని నెట్టేలా విమర్శలు చేస్తున్నారు.
జగన్ కు ఇబ్బంది కరంగా..
వైసిపి ఎంపి అభ్యర్ది ప్రత్యేక హోదా పై చేసిన వ్యాఖ్యల తో ఇప్పుడు జగన్ కు ఇబ్బంది కర పరిస్థితులు ఏర్పడ్డాయి. తొలి నుండి ప్రత్యేక హోదా పై తామే పోరాటం చేస్తున్నామని..చంద్రబాబు యు టర్న్ తీసుకున్నారని వైసిపి నేతలు విమర్శిస్తూ వచ్చారు. ఇప్పుడు ఎన్నికల సమయంలో ప్రత్యేక హోఆ అనేది ఒక సెంటిమెంట్ అంశం గా మారింది. రెండు ప్రధాన పార్టీలు ఈ అంశాన్ని తమ ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు. ఈ సమయంలో పివిపి ఈ వ్యాఖ్యలు చేసారు. ఇక, దీని పై వైసిపి నుండి ఎవరు స్పందించకపోయినా..పివిపి మాత్రం తన వ్యాఖ్యలను వక్రీకరించారని చెబుతున్నా రు. విజయవాడ లాంటి నగరాల్లో హోదా సెంటిమెంట్ బలంగా ఉంది. దీంతో..ఇప్పుడు వైసిపి అధినేత నష్ట నివారణ కోసం చర్యలు చేపట్టాల్సి ఉంది.
సీయం అంటే క్రిమినల్ మినిష్టర్..బాబు ఓ మాయావి: జగన్ తీవ్ర ఆరోపణలు..!
టిడిపి నేతలకు లక్ష్యంగా..
పివిపి వ్యాఖ్యలను ఎన్నికల ప్రచారం వేళ టిడిపి నేతలు అస్త్రంగా మలచుకుంటున్నారు. వైసిపి హోదా మీద డ్రామా లు ఆడారాని..వారికి చిత్తశుద్ది లేదనే విషయం ఆ పార్టీ ఎంపి అభ్యర్ది చేసిన వ్యాఖ్యలతోనే స్పష్టం అవుతందని సీయం చంద్రబాబు వ్యాఖ్యానించారు. పివిపి వ్యాఖ్యల పై ఆయన పై పోటీ చేస్తున్న టిడిపి అభ్యర్ది కేశినేని నాని సైతం తీవ్రం గా స్పందించారు. తాము హోదా కోసం పార్లమెంట్ లోపలా బయటా పోరాటం చేసామని గుర్తు చేసారు. ప్రణాళికా బద్దం గా హోదా సాధన కోసం ముందుకు వెళ్తున్నామన్నారు. పివిపి అంతర్జాతీయ స్కామ్స్టర్ అని ఆరోపించిన నాని .. జగన్ డబ్బును పివిపి నే హవాలా చేసారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు.ఆయన అమెరికన్ బ్యాంకులను మోసం చేసా రని ఆరోపించారు.