సిఎం ఫోటో లేదని..: నడి రోడ్డు పైనే ఎమ్మెల్యే (పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యుడు ఆకుల రాజేందర్ అధికారుల పైన ఆగ్రహం వ్యక్తం చేసారు.
మల్కాజ్గిరిలోని నేరేడ్మెట్ ప్రాంతంలో మూడవ విడత రత్చబండ కార్యక్రమానికి గురువారం అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే బ్యానర్ పైన ముఖ్యమంత్రి ఫోటో లేదు.
దీంతో మల్కాజిగిరి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ అధికారుల పైన తన అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు నిర్లక్ష్యం వహించారంటూ ఆయన రోడ్డు పైనే రచ్చబండను నిర్వహించారు.
రచ్చబండ 1
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని మల్కాజిగిరి నియోజకవర్గం నేరేడ్మెట్ ప్రాంతంలో మూడో విడత రచ్చబండ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన దృశ్యం.
రచ్చబండ 2
ప్రోటో కాల్ ప్రకారం రచ్చబండ కార్యక్రమం వేదిక వద్ద ఉన్న బ్యానర్ పైన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బొమ్మ లేకపోవడంపై ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ అధికారులను ప్రశ్నించారు.
రచ్చబండ 3
రచ్చబండ కార్యక్రమంలో అధికారులు నిర్లక్ష్యం వహించారంటూ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ రచ్చబండ కార్యక్రమం నుండి వెనుదిరిగారు.
రచ్చబండ 4
ఎమ్మెల్యే ఆకులకు స్థానిక ప్రజలు నచ్చ జెప్పారు. దీంతో ఆయన రోడ్డు పైన నిలబడు ప్రజలతో మాట్లాడి, వారి నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
రచ్చబండ 5
ఎమ్మెల్యే ఆకుల రాజేందర్కు స్థానిక ప్రజలు నచ్చ జెప్పారు. దీంతో ఆయన రోడ్డు పైన నిలబడు ప్రజలతో మాట్లాడి, వారి నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
రచ్చబండ 6
రచ్చబండ కార్యక్రమం నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే ఆకుల రాజేందర్కు ఇచ్చేందుకు హడావుడిగా విజ్ఞాపన పత్రాలు రాస్తున్న వికలాంగుల దృశ్యం.
రచ్చబండ 7
రచ్చబండ కార్యక్రమంలో అధికారులు నిర్లక్ష్యం వహించారంటూ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ రచ్చబండ కార్యక్రమం నుండి వెనుదిరిగారు. ఆ తర్వాత రోడ్డు పైన సమస్యలు అడిగి తెలుసుకున్నారు.