దారుణం: పెళ్ళి చేస్తానని తీసుకువచ్చి కూతురిపై అత్యాచారం
కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అవకాశం దొరికినప్పుడల్లా కూతురిని బెదిరించి ఆమెపై లైంగికవాంఛ తీర్చుకొన్నాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకొంది.
ఏలూరు: కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అవకాశం దొరికినప్పుడల్లా కూతురిని బెదిరించి ఆమెపై లైంగికవాంఛ తీర్చుకొన్నాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకొంది.
పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం అనుమాజీపాలెం గ్రామానికి చెందిన రఫాయేలు, రత్నకుమారి దంపతులు మనస్పర్థల కారణంగా కొన్నేళ్ళ క్రితం విడిపోయారు. ఈ దంపతులకు ఓ కుమార్తె ఉంది.
భార్య, భర్తలు విడిపోవడంతో ఆ బాలిక తణుకులోని అమ్మమ్మ వద్ద ఉంటోంది. భార్యతో విడిపోయిన తర్వాత ఆయన రెండో వివాహం చేసుకొన్నాడు. కొద్ది కాలం క్రితం అతను తణుకు వెళ్ళి కూతురికి పెళ్ళి చేస్తానని నమ్మించాడు. కూతురిని తన ఇంటికి తీసుకువచ్చాడు.
అయితే అప్పటి నుండి ఇంట్లో రెండో భార్య లేని సమయంలో బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలితో పాటు ఆమె పిన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలిని వైద్య పరీక్షల నిమితతం తణుకు ఏరియా ఆసుపత్రికి తరలించారు పోలీసులు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.