జగన్ సీఎం అయితే వెంటనే కలవాలా ? పృధ్వీ వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చిన రాజేంద్రప్రసాద్
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం తెలుగు సినీ పరిశ్రమకు ఇష్టం లేదని, అందుకే ఆయన సీఎం అయిన తర్వాత సినీ పరిశ్రమ నుండి ఏ ఒక్కరూ కూడా వెళ్లి మర్యాదపూర్వకంగా కలవలేదని ఎస్వీబీసీ చైర్మన్, సినీ నటుడు పృథ్వీ సినీ పరిశ్రమ గురించి సంచలన ఆరోపణలు చేశారు. ఇక దీనిపై ఇప్పటికే పోసాని కృష్ణ మురళి ఇప్పటికే తన స్పందన తెలియజేశారు. పృధ్వీ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఇక తాజాగా పృధ్వీ వ్యాఖలపై ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ కాస్త ఘాటుగానే స్పందించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కేసీఆర్ వ్యాఖ్యలకు జయప్రకాశ్ నారాయణ్ చురకలు
పృధ్వీ వ్యాఖలకు ఇటీవల వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణ మురళి కౌంటర్
మొన్నటికి మొన్న పృధ్వీ వ్యాఖలపై వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణ మురళి పృథ్వీ తొందరపడి వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. జగన్ సీఎం కావడం సినీ పరిశ్రమ పెద్దలకు ఇష్టం లేదన్న వ్యాఖ్యలు "బిగ్ మిస్టేక్ "గా అభివర్ణించారు. సీఎం అయిన జగన్ ని కలిసి, ఓ పూల దండ వేసి, అభినందిస్తే, ఆయనపై ప్రేమ ఉన్నట్టు, లేకపోతే లేదనుకుంటే పొరపాటేనని పోసాని అభిప్రాయపడ్డారు. అలా అయితే గత ఎన్నికల్లో చంద్రబాబు గెలిచారని, అప్పుడు తానేమి చంద్రబాబును కలిసి అభినందించలేదని, అంటే, చంద్రబాబు సీఎం కావడం తనకు ఇష్టం లేదని అనుకోవడం కరెక్టు కాదు కదా అని ఆయన లాజిక్ మాట్లాడారు .
మరోసారి పృధ్వీ వ్యాఖ్యలపై రాజేంద్ర ప్రసాద్ సెటైర్లు
ఇక తాజాగా నటకిరీటి రాజేంద్రప్రసాద్ సీఎంను వెంటనే కలవడానికి సినీ నటులేమీ వ్యాపారవేత్తలు కాదని ఆయన అన్నారు. జగన్ సీఎం అయితే వెంటనే కలవాలని ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. వ్యాపారాలు చేసే వారైతే కలుస్తారేమో కానీ అసలు కళాకారులు సీఎంను కలవాలన్న నిబంధన ఏమీ లేదని రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాస్త కుదురుకున్నాక తప్పకుండా కలుస్తామని రాజేంద్రప్రసాద్ తెలిపారు.
త్వరలో సీఎంను కలుస్తామని వెల్లడించిన నటకిరీటి రాజేంద్రప్రసాద్
సినీ పరిశ్రమకు వీళ్ళు , వాళ్ళు అన్న తేడాలేవీ లేవని , ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వారిని సముచితంగా గౌరవించే విధానం సినీ పరిశ్రమ వర్గాల్లో ఉందని ఆయన క్లారిటీ ఇచ్చారు. రెండు తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు సినీ పరిశ్రమ పట్ల చాలా సానుకులంగా ఉన్నారని రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు . లేనిపోని ఊహాగానాలు సృష్టిస్తే బాగోదు అన్న భావన ఆయన తన మాటల్లో వ్యక్తం చేశారు. ప్రజలకు తాగునీరందించే ముఖ్యమంత్రి తమకు దేవుడని రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యనించారు. అయితే ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని నేడు కలవాల్సిఉందని, కొన్ని కారణాల వల్ల మరో రెండు మూడురోజుల్లో కలిసేందుకు ఆయన అపాయింటుమెంట్ ఇచ్చారని రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు.