పవన్ని మరో సారి టార్గెట్ చేసిన ఆర్జీవీ... ఏపీ ప్రజలను అవినీతి పరులంటారా !
భీమవరంలో తనను ఓడించడానికి 150 కోట్లు ఖర్చుపెట్టారని జనసేన అధినేత పవన్ కళ్యాన్ ఆదివారం అమరావతిలో ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలపై గట్టి కౌంటర్ ఇచ్చారు రాంగోపాల్ వర్మ. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఓటర్లను అవమానించే విధంగా ఉన్నాయని తెలిపారు. ఒకవేళ ఓటర్లు పవన్ కళ్యాణ్ను గెలిపించానుకుంటే ఎన్ని డబ్బులు తీసుకున్నా..అయనకే ఓటు వేసే వారని పేర్కోన్నారు. ఈనేపథ్యంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని తెలిపారు.
ఇప్పటి వరకు తన అశయాలకు అనుగుణంగానే ఎన్నికల్లో పోరాడానని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్...ఇక భవిష్యత్లో ఆశయాలతోపాటు రాజకీయ ఎత్తుగడలను చూస్తారని అన్నారు.. ఇన్నాళ్లు రాజకీయ కుట్రలు చేయలేక కాదని, పవన్ కళ్యాణ్ ఆశయాలను అనుగుణంగా పార్టీని నడపడానికే మొగ్గు చూపానని అన్నారు. ఈ సంధర్భంగా తాను విలువల కోసం నిలబడతానిని అన్నారు. మరోవైపు తనను భీమవరంలో ఓడించడానికి 150 కోట్లు ఖర్చు పెట్టారని అన్నారు. ఇందులో ఒక్క వీరవాసరం మండలంలోనే 30 కోట్ల రుపాయలను ఖర్చు పెట్టారని అన్నారు.అయితే
కాగా ఇప్పటి వరకు ఒక్క పవన్ కళ్యాణ్ను మాత్రమే చూశారని ఇక నుండి నుండి సమాజంలో మార్పు వచ్చే వరకు తన వ్యుహాలు ఎత్తుగడలు కొనసాగుతాయని అన్నారు. ఇవి శ్రీకాకుళంలో వలసలు ఆగిపోయో వరకు తన పోరాటం అగదని అన్నారు.