విశాఖ రైల్వే జోన్ బిల్లు: రామ్మోహన్నాయుడికి స్పీకర్ లేఖ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ డిమాండ్ అయిన విశాఖపట్నం కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటుపై బిల్లు పెట్టేందుకు అంగీకరిస్తూ శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడుకు ఓ లేఖ అందింది. లోక్సభలో బిల్లు పెట్టేందుకు తనకు అనుమతి ఇవ్వాలని గతంలో రామ్మోహన్ నాయుడు స్పీకర్కు లేఖ పంపారు.
ఈ నేపథ్యంలో లోక్సభ సెక్రటేరియట్ ఆయనకు తాజాగా లేఖ ద్వారా సమాచారం పంపింది. ఏపీ విభజన చట్టం ప్రకారం విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటుకు ప్రతిపాదన చేసిన విషయం తెలిసిందే. రైల్వేజోన్ చట్టం -2017 పేరుతో బిల్లును ప్రతిపాదించేందుకు లోక్సభ సచివాలయం అంగీకారం తెలిపింది.
విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, వాల్తేరు డివిజన్లను కలిపి జోన్ ఏర్పాటుకు బిల్లు పెట్టనున్నారు. ఈ బిల్లు సభ ఆమోదం పొందితే మూడు నెలల్లో రైల్వే శాఖ చర్యలు చేపట్టే అవకాశాలున్నాయి.
Comments
andhra pradesh visakhapatnam railway zone srikakulam kinjarapu rammohan naidu ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం రైల్వే జోన్ శ్రీకాకుళం రామ్మోహన్నాయుడు
English summary
It is said that TDP MP Kinjarapu Ram mohan naidu on Monday received a letter from speaker about visakhapatnam railway zone bill.
Story first published: Monday, December 4, 2017, 20:10 [IST]