వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రలోభ పెడుతున్నారు: బాబుపై రామచంద్రయ్య ఫైర్

|
Google Oneindia TeluguNews

Ramachandraiah fires at Chandrababu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత సి రామచంద్రయ్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. శాసనమండలిలో ఇతర పార్టీల ఎమ్మెల్సీలను టిడిపిలో చేర్చుకునేందుకు చంద్రబాబు ప్రలోభ పెడుతున్నారని ఆరోపించారు.

ప్రమాణ స్వీకారం చేయకముందే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడిని టిడిపిలో చేర్చుకుని ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బ తీసిన ఘనుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. ఇక గవర్నర్ ప్రసంగం దిశానిర్దేశం లేకుండా ఉందని అన్నారు. గవర్నర్ ప్రసంగంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

రుణమాఫీ వంటి హామీలపై ఎలాంటి స్పష్టత లేదని రామచంద్రయ్య అన్నారు. గవర్నర్‌తో చంద్రబాబు నాయుడు చెప్పించినట్లుగా ఏపి దివాలా తీయలేదని ఆయన అన్నారు. రాతియుగం నుంచి ఏపిని అభివృద్ధి చేయాలన్నట్లుగా చూపారని రామచంద్రయ్య విమర్శించారు.

గత ప్రభుత్వాలు అమలు చేసిన సంక్షేమ పథకాలు రద్దు చేస్తామంటే వ్యతిరేకిస్తామని అన్నారు. రెండు రాష్ట్రాల అసెంబ్లీల్లో గవర్నర్ నర్సింహన్ ప్రసంగాలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయని రామచంద్రయ్య ఆరోపించారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తానని చెప్పిన ప్రధాని నరేంద్ర మోడీ, ఇప్పుడు రైల్వే ఛార్జీలను ఎందుకు పెంచారో స్పష్టం చేయాలన్నారు. రైల్వే ఛార్జీల పెంపు వల్ల ఇతర సరుకుల ధరలు పెరుగుతాయన్నారు.

English summary

 Former Minister C Ramachandraiah on Saturday fired at Andhra Pradesh CM N Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X