'సత్యం' రామలింగ రాజును ఇలా జైలుకు తరలించారు (పిక్చర్స్)
హైదరాబాద్: సత్యం కుంభకోణం కేసులో ప్రత్యేక కోర్టు తీర్పును వెలువరించిన తర్వాత సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపకుడు రామలింగ రాజును, ఇతర 9 మందిని పోలీసులు హైదరాబాదులోని చర్లపల్లి జైలుకు తరలించారు.
రామలింగ రాజుతో పాటు పది మందికి కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. రామలింగరాజుకు, ఆయన సోదరుడు రామరాజుకు 5 కోట్ల రూపాయల జరిమానా, మిగతా దోషులకు 24 లక్షల రూపాయలేసి జరిమానా విధించింది.
సత్యం కేసులో నిందితుడిగా రామలింగ రాజు గతంలో 33 నెల పాటు జైలులో ఉన్నారు. తనకు శిక్ష తగ్గించాలని రామలింగ రాజు కోర్టును కోరుకున్నారు. సత్యం కుంభకోణం కేసులో రాజు సహా ఆయన తమ్ముడు రామరాజు, సత్యం మాజీ సీఎఫ్వో వడ్లమాని శ్రీనివాస్గుప్తా కూడా రూ.2 లక్షల వ్యక్తిగత పూచికత్తుపై సుప్రీం 2011 నవంబర్ 4న బెయిల్ మంజూరు చేసింది. అప్పటి నుంచి బయటే ఉంటూ విచారణకు హాజరవుతున్నారు.
రాజు జైలుకు ఇలా..
కోర్టు తీర్పు వెలువరించిన తర్వాత సత్యం రామలింగ రాజును పోలీసులు ఇలా జైలుకు తరలించారు.
జైలుకు రాజు ఇలా...
సత్యం కుంభకోణం కేసులో తుది తీర్పు వెలువడిన తర్వాత రామలింగ రాజు సహా పది మందిని చర్లపల్లి కారాగారానికి తరలించారు.
జైలుకు రాజు ఇలా..
సత్యం కుంభకోణం కేసులో ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించిన తర్వాత సత్యం రామలింగ రాజును చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు.
జైలుకు రాజు ఇలా..
తాను దేశానికి, సమాజానికి చేసిన సేవలను గుర్తించి తనకు శిక్ష తగ్గించాలని రామలింగ రాజు న్యాయమూర్తిని వేడుకున్నారు. అయినా జైలు జీవితం తప్పలేదు.
జైలుకు రాజు ఇలా...
గతంలో కూడా సత్యం రామలింగ రాజు జైలు జీవితం గడిపారు. అప్పుడు నిందితుడిగా ఆయన జైలులో ఉన్నారు.
జైలుకు రాజు ఇలా...
సత్యం రామలింగ రాజును, ఇతర దోషులను న్యాయస్థానం తీర్పు తర్వాత చర్లపల్లి జైలుకు తరలించారు.