ఆశ్చర్యపోయానని రామోజీ, రజనీకాంత్కు ఆశీర్వాదం, ప్రియాంకతో సానియా (పిక్చర్స్)
న్యూఢిల్లీ: రామోజీ సంస్థల అధిపతి రామోజీ రావు, సూపర్ స్టార్ రజనీకాంత్ తదితరులు మంగళవారం నాడు పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆయనకు పద్మ పురస్కారాలను అందజేశారు.
వీరితో పాటు వాసుదేవ్ కల్కుంటే ఆత్రే, గిరిజా దేవి, విశ్వనాథ శాంతలు పద్మవిభూషణ్ పురస్కారాలు అందుకున్నారు. పద్మ పురస్కారాలు అందుకునేందుకు హాజరైన రామోజీ రావు, రజనీకాంత్లు పక్కపక్కనే కూర్చున్నారు. వీరిద్దరు ముచ్చటించుకున్నారు.
సానియా మీర్జా, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఉదిత్ నారాయణ్, రాజమౌళి తదితరులు కూడా పద్మ అవార్డులు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, వెంకయ్య నాయుడు తదితరులు హాజరయ్యారు. గత నెల (మార్చి 28న) తొలి విడద పద్మ అవార్డులు అందించారు. ఇప్పుడు రెండోదఫా ఇచ్చారు.
రెండో విడతలో ఐదుగురికి పద్మవిభూషణ్, పదిమందికి పద్మభూషణ్, 40 మందికి పద్మశ్రీ అందించారు. పద్మభూషణ్ అందుకున్న వారిలో.. రవీంద్ర చంద్ర భార్గవ, ఇందూజైన్, ఉదిత్ నారాయణ్, కన్హయ్యాలాల్, సానియా మీర్జా, డా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, స్వామి తేజోమయానంద, రామ్ వి సుతర్, ప్రొ ఎన్ ఎస్ రామానుజ తాతాచార్య తదితరులు అందుకున్నారు.
ఆశ్చర్యపోయా: రామోజీ రావు
అవార్డు స్వీకరించిన అనంతరం రామోజీ రావు మాట్లాడుతూ.. పద్మవిభూషణ్ పురస్కారానికి నేను ఎంపికైనట్లు సమాచారం తెలిసినప్పుడు తన ఆశ్చర్యానికి అవధుల్లేవని, నిబద్ధతతో పనిచేస్తూ పోతే గుర్తింపు దానంతట అదే వస్తుందన్న తన నమ్మకాన్ని ఈ పరిణామం బలోపేతం చేసిందన్నారు.
తన దృష్టిలో పత్రికా రంగమనేది, ప్రజా సేవ చేసేందుకు అద్భుతమైన వేదిక అని, పాత్రికేయం పట్ల తనకున్న అభిరుచి తనను ఇంతటి గౌరవానికి అర్హుడిని చేయడం అంతులేని సంతోషాన్ని ఇచ్చిందన్నారు. తన మీడియాను విశ్వసించడమే కాకుండా నాపై అభిమానాన్ని కురిపించిన ప్రజలందరికీ ఎంతో రుణపడి ఉన్నానని చెప్పారు.
పద్మ అవార్డులు
మంగళవారం నాడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పలువురికి పద్మ అవార్డులు అందజేశారు. అవార్డు అందుకునేందుకు వచ్చిన ప్రియాంక చోప్రా
పద్మ అవార్డులు
మంగళవారం నాడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పలువురికి పద్మ అవార్డులు అందజేశారు. అవార్డు అందుకునేందుకు వచ్చిన బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా
పద్మ అవార్డులు
మంగళవారం నాడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పలువురికి పద్మ అవార్డులు అందజేశారు. అవార్డు అందుకునేందుకు వచ్చిన ప్రియాంక చోప్రాను క్లిక్ మనిపిస్తున్న ఫోటో గ్రాఫర్.
పద్మ అవార్డులు
మంగళవారం నాడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పలువురికి పద్మ అవార్డులు అందజేశారు. పద్మ అవార్డులు అందుకునేందుకు వచ్చిన ప్రియాంక చోబ్రా, టెన్నిస్ తార సానియా మీర్జా.
పద్మ అవార్డులు
మంగళవారం నాడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పలువురికి పద్మ అవార్డులు అందజేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్తో మాట్లాడుతున్న ప్రియాంక చోప్రా.
పద్మ అవార్డులు
మంగళవారం నాడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పలువురికి పద్మ అవార్డులు అందజేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్తో ప్రియాంక చోప్రా, సానియా మీర్జా ఫోటోలు.
పద్మ అవార్డులు
మంగళవారం నాడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పలువురికి పద్మ అవార్డులు అందజేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్తో మాట్లాడుతున్న స్వామి దయానంద. పక్కన రామోజీ రావు, సానియా మీర్జా.
పద్మ అవార్డులు
మంగళవారం నాడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పలువురికి పద్మ అవార్డులు అందజేశారు. స్వామి దయానంద ఆశీర్వాదం తీసుకుంటున్న సూపర్ స్టార్ రజనీకాంత్.
పద్మ అవార్డులు
మంగళవారం నాడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పలువురికి పద్మ అవార్డులు అందజేశారు. అవార్డులు అందుకునేందుకు వచ్చిన ప్రియాంక చోప్రా తదితరులు.
పద్మ అవార్డులు
మంగళవారం నాడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పలువురికి పద్మ అవార్డులు అందజేశారు. రెండో విడతలో ఐదుగురికి పద్మవిభూషణ్, పదిమందికి పద్మభూషణ్, 40 మందికి పద్మశ్రీ అందించారు.
పద్మ అవార్డులు
మంగళవారం నాడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పలువురికి పద్మ అవార్డులు అందజేశారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న రజనీకాంత్.
పద్మ అవార్డులు
మంగళవారం నాడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పలువురికి పద్మ అవార్డులు అందజేశారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న సానియా మీర్జా.
పద్మ అవార్డులు
మంగళవారం నాడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పలువురికి పద్మ అవార్డులు అందజేశారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న అనంతరం సానియా మీర్జా.
పద్మ అవార్డులు
మంగళవారం నాడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పలువురికి పద్మ అవార్డులు అందజేశారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న అనంతరం సానియా మీర్జా.
పద్మ అవార్డులు
మంగళవారం నాడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పలువురికి పద్మ అవార్డులు అందజేశారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న ప్రియాంక చోప్రా.