వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ ఎమ్మెల్యే కొడుకుపై రేప్ కేసు.. గిరిజన యువతిపై..

|
Google Oneindia TeluguNews

కాకినాడ : మొన్నటికి మొన్న ఏపీ మంత్రి రావెల కిశోర్ బాబు తనయుడు సుశీల్.. నడిరోడ్డుపై ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించి వివాదంలో ఇరుక్కోగా.. తాజాగా మరో ఎమ్మెల్యే తనయుడిపై అత్యాచార ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది.

తనను మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేస్తూ.. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే పరుపుల సుబ్బారావు తనయుడు రాజాబాబుపై ఓ గిరిజన యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. పెళ్లి పేరుతో తనను మోసగించాడని పేర్కొంటూ రాజాబాబుపై సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది గిరిజన యువతి.

Rape case on MLA Varupula subbarao son Rajababu

యువతి ఫిర్యాదుతో రాజాబాబుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో పాటు అత్యాచార కేసు నమోదు చేశారు పోలీసులు. వీటితో పాటు క్రైమ్ నంబర్ 323/16 కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. అనంతరం యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎట్టి పరిస్థితుల్లోను తమకు న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తోన్న బాధిత యువతి బంధువులు.. రాజాబాబును కేసు నుంచి తప్పించేందుకు తెరవెనుక కొంతమంది పావులు కదుపుతున్నారని ఆరోపిస్తున్నారు.

English summary
Rape case was filed on east godavari MLA Varupula Subbarao's son Rajababu. Case was filed by a lady who belongs to tribal community
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X