గెస్ట్ హౌస్లో రేవ్ పార్టీ: భగ్నం చేసిన విశాఖ పోలీసులు
విశాఖపట్నం: రేవ్ పార్టీల సంస్కృతి క్రమంగా దేశంలోని పలు ప్రధాన నగరాలకు విస్తరిస్తోంది. తాజాగా, విశాఖపట్నంలోని ఓ రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. పరవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీపీసీ సమీపంలో ఓ గెస్ట్ హౌస్లో రేవ్ పార్టీ జరుగుతున్నట్లు తెలుసుకున్న పోలీసులు, గెస్ట్ హౌస్పై దాడి చేశారు.
ఆరుగురు మహిళలను, నలుగురు ఫైనాన్షియర్లను అరెస్టు చేశారు. మరో 40 మంది పరారయ్యారు. హైదరాబాద్ శివార్లలో గత కొంతకాలంగా ఇలాంటి రేవ్ పార్టీలు జరుగుతుండటం తెలిసిందే. ఇప్పడు ఈ రేవ్ పార్టీల కల్చర్ విశాఖలోనూ కనిపించడంతో సామాజికి వేత్తలను కలవరపెడుతుంది.
సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి అయ్యన్న పాత్రుడు
ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు సచివాలయంలోని అధికారులతో నీటి ఎద్దడి, పంచాయతీల్లో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. విద్యుత్ ఆదా కోసం 659 మేజర్ పంచాయతీల్లో ఎల్ఈడీ బల్బులు అమరుస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. చెత్త తరలించేందుకు మేజర్ పంచాయతీలకు వాహనాలు కేటాయిస్తామన్నారు. వేసవిలో నీటి ఎద్దడి ఎదుర్కొనేందుకు రూ. 40 కోట్లు కేటాయించినట్లు మంత్రి అయ్యన్న పాత్రుడు తెలిపారు.