విజయవాడలో ఆ ఇద్దరూ..!? పోలీసులకు రవిప్రకాశ్..శివాజీ మెయిల్: 10 రోజుల గడువు ఇవ్వండి..!
Recommended Video
కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాశ్..నటుడు శివాజీ హాజరు కోసం పోలీసులు నిరీక్షిస్తున్నారు. హైకోర్టు సైతం రవి ప్రకాశ్ అభ్యర్దన తిరస్కరించింది. దీంతో..తెలంగాణ పోలీసులకు వారిద్దరి నుండి మెయిల్స్ వచ్చాయి. తమకు పది రోజుల సమయం కావాలంటూ వేర్వేరు కారణాలను అందులో ప్రస్తావించారు. అయితే, వారిద్దరూ విజయవాడలో ఉన్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.
పోలీసులకు
మెయిల్స్..
టీవీ9
వ్యవహారంతో
అజ్ఞాతంలోకి
వెళ్లిన
రవి
ప్రకాశ్..శివాజీ
నుండి
సైబర్
క్రైమ్
పోలీసులకు
ఈ
మెయిల్స్
వచ్చాయి.
తాను
పోలీసుల
ముందు
విచారణకు
హాజరయ్యేందుకు
పది
రోజుల
సమయం
ఇవ్వాలని
ఆయన
మెయిల్
ద్వారా
కోరారు.
తానున
వ్యక్తిగత
కారణాల
వలన
విచారణకు
హాజరు
కాలేనని
వివరించారు.
అదే
విధంగా
ఇదే
కేసుతో
సంబంధం
ఉన్న
సినీ
నటుడు
శివాజీ
సైతం
పోలీసులకు
మెయిల్
పంపారు.
తనకు
ఆరోగ్యం
సరిగా
లేదని
అందులో
పేర్కొన్నారు.
తాను
ప్రస్తుతం
చికిత్స
పొందుతున్నానని..విచారణకు
హాజరయ్యేందుకు
పది
రోజుల
సమయం
కావాలని
అందులో
విజ్ఞప్తి
చేసారు.
పోలీసులు
ఈ
మెయిల్స్
పైన
సంతృప్తి
చెందని
పోలీసులు
వీరెక్కడున్నారనే
కోణంలో
విచారణ
సాగిస్తున్నట్లు
చెబుతున్నారు.
విజయవాడలో
ఆ
ఇద్దరూ..
పోలీసులకు
వచ్చిన
మెయిల్స్
ఐపి
చిరునామాల
ఆధారంగా
ఆ
ఇద్దరూ
విజయవాడలో
ఉన్నారనే
సమాచారం
పోలీసులు
గుర్తించారని
చెబుతున్నారు.
దీని
పైన
వారు
దృష్టి
సారించినట్లు
తెలుస్తోంది.
అంతకు
ముందు
తనపై
పోలీసులు
సీఆర్పీసీ
154
కింద
కేసు
నమోదు
చేయడాన్ని
సవాల్
చేస్తూ
దాఖలు
చేసిన
లంచ్
మోషన్
పిటిషన్ను
విచారణకు
చేపట్టాలన్న
రవిప్రకాశ్
తరఫు
న్యాయవాది
వినతిని
హైకోర్టు
తోసిపుచ్చింది.
అత్యవసరంగా
విచారణ
చేపట్టాల్సిన
అవసరమేమీ
లేదని
న్యాయస్థానం
తేల్చిచెప్పింది.
తదుపరి
విచారణను
వచ్చే
జూన్కు
వాయిదా
వేసింది.
దీంతో..
పోలీసులను
సమయం
కోరుతూ
మెయిల్స్
పంపారు.
ఇప్పుడు
సైబర్
పోలీసులు
వీరి
అభ్యర్ధనను
ఉన్నతాధికారుల
దృష్టికి
తీసుకెళ్లారు.
వారు
వీటి
పైన
ఏరకంగా
స్పందిస్తారనేది
వేచి
చూడాల్సిందే.
వారు
అడిగిన
పది
రోజుల
సమయం
పరిశీలిస్తే..23న
ఎన్నికల
ఫలితాల
తరువాత
పరిస్థితుల్లో
మార్పు
వస్తుందనే
అంచనాతో
ఈ
రకంగా
సమయం
కోరుతూ
మెయిల్స్
పంపారనే
చర్చ
సాగుతోంది.