యువతిని వేధించిన కేసులో రిజర్వ్ ఎస్ ఐ అరెస్టు
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే భక్షకులుగా వ్యవహరిస్తున్నారు. ఓ యువతిని రిజర్వ్ ఎ స్ ఐ వేధిస్తున్నాడు. ఆ యువతి వేధింపులపై యువతి ఫిర్యాదు మేరకు రిజర్వ్ ఎస్ ఐ పోలీసులు అరెస్టు చేశారు.
విశాఖపట్టణం : ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే భక్షకులుగా వ్యవహరిస్తున్నారు. ఓ యువతిని రిజర్వ్ ఎ స్ ఐ వేధిస్తున్నాడు. ఆ యువతి వేధింపులపై యువతి ఫిర్యాదు మేరకు రిజర్వ్ ఎస్ ఐ పోలీసులు అరెస్టు చేశారు.
విశాఖ పట్టణంలోని కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో కప్పరాడ రాంజీ ఎస్టేట్ లో ఓ యువతి నివాసం ఉంటుంది. ఆమె డాబా గార్డెన్స్ లో ని దుకాణంలో పనిచేస్తోంది. ఆమె స్నేహితురాలు ఆచూకీ వారం రోజులుగా కన్పించడం లేదు.
అయితే ఈ కేసు విషయమై రిజర్వ్ ఎస్ ఐ ఆ యువతిని వేధిస్తున్నాడు. బుదవారం రాత్రి పూట యువతికి ఫోన్ చేసి నీ స్నేహితురాలు చనిపోయింది. ఆమె చనిపోవడానికి నీ ప్రమేయముందంటూ ఆమెను భయపెట్టాడు. ఎక్కడ ఉంటున్నావో చెప్పాలంటూ నిలదీశాడు.
దీంతో ఆమె భయపడిపోయింది. తాను ఎక్కడ ఉన్నానో ఆ యువతి చెప్పింది. దీంతో ఆ యువతి ఉన్న ప్రదేశానికి వచ్చిన ప్రసాద్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు.దీంతో ఆ యువతి రిజర్వ్ ఎస్ ఐ ను తప్పించుకొని వచ్చిన యువతి స్థానికుల సహయంతో కంచరపాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
ఈ ఫిర్యాదు ఆధారంగా రిజర్వ్ ఎస్ ఐ ప్రసాద్ ను అదుపులోకి తీసుకొన్నారు పోలీసులు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రసాద్ ప్రస్తుతం విజయవాడలో రిజర్వ్ ఎస్ ఐ గా పనిచేస్తున్నాడు.