వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రిటైర్మెంట్ తర్వాత నాలుగో పెళ్ళికి రెడీ అయిన ఘనుడు ... భర్త వేధింపులపై భార్య ఫిర్యాదు

|
Google Oneindia TeluguNews

అతని వయసు 60 ఏళ్ళ పైమాటే.. అయినా భార్యను చిత్రహింసలకు గురి చేస్తూ ఏకంగా నాలుగో పెళ్లికి రెడీ అయ్యాడు. భార్యను వేధించి ఇంట్లో నుంచి గెంటి వేయడంతో పాటుగా, విడాకులు ఇవ్వాలని బెదిరిస్తూ నాలుగో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిన ప్రబుద్ధుడిపై సహనం నశించిన సదరు భార్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ ఉదంతం అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది.

 మూడో భార్యనూ వేధింపులకు గురి చేస్తున్న భర్త

మూడో భార్యనూ వేధింపులకు గురి చేస్తున్న భర్త

భార్య భర్తపై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విశాఖపట్నం డాక్ యార్డ్ ఉద్యోగిగా పనిచేసిన వాసంశెట్టి విష్ణు పోతన తో తూర్పు గోదావరి జిల్లా తాళ్లపొలం గ్రామానికి చెందిన లక్ష్మీ సరోజకు 1998లో వివాహం జరిగింది. ఆ సమయంలోనూ ఐదు లక్షల కట్నం, లక్ష రూపాయల లాంఛనాలు తీసుకున్న సదరు ప్రబుద్ధుడు అంతకు ముందు తనకు రెండు వివాహాలు జరిగిన విషయం చెప్పకుండా దాచి పెట్టి లక్ష్మీ సరోజను పెళ్లాడాడు. సదరు ప్రబుద్ధుడుకి పిల్లలు పుట్టే అవకాశం లేకపోవడంతో, ఓ మగ బిడ్డని తీసుకొచ్చి పెంచుకుంటున్నారు.

 రిటైర్మెంట్ తర్వాత భార్యను వెళ్ళగొట్టిన భర్త .. విడాకుల కోసం వేధింపులు

రిటైర్మెంట్ తర్వాత భార్యను వెళ్ళగొట్టిన భర్త .. విడాకుల కోసం వేధింపులు

మొదటి నుండి చీటికిమాటికి వేధింపులకు గురి చేసే భర్త ఇటీవల రిటైర్ అయ్యారు.

రిటైర్మెంట్ తర్వాత విష్ణు పోతన లోని శాడిజం మరింత పెరిగింది. దీంతో ఆయన భార్య లక్ష్మీ సరోజను చిత్రహింసలకు గురి చేసి ఇంట్లో నుంచి గెంటేశారు. పుట్టింటికి వచ్చి జీవనం సాగిస్తున్న లక్ష్మీ సరోజ వద్దకు ఇటీవల వచ్చిన విష్ణు పోతన విడాకుల పత్రాలపై సంతకాలు చేయాల్సిందిగా ఆమెను బెదిరించాడు. అంతేకాదు నాలుగో పెళ్లికి రెడీ అయిన విష్ణు పోతన తాజాగా పత్రికా ప్రకటన ఇచ్చినట్లుగా భార్య లక్ష్మి సరోజ ద్రాక్షారామం పోలీసులను ఆశ్రయించింది .

 నాలుగో పెళ్లి చేసుకోబోతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య

నాలుగో పెళ్లి చేసుకోబోతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య


తాను ఇచ్చిన ఫిర్యాదులోపై విషయాలను పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భార్య ఫిర్యాదుతో అసలు భార్యాబహ్రతల మధ్య ఎం జరిగింది అన్నదానిపై విచారణ సాగిస్తున్నారు .భార్య ఫిర్యాదులో ఏ మేరకు వాస్తవం ఉంది అని దర్యాప్తు చేస్తున్న పోలీసులు , ఒకవేళ వాస్తవం అయితే

సదరు ప్రబుద్దుడిపై కేసు నమోదు చేసే ఆలోచనలో ఉన్నారు . రిటైర్మెంట్ అయ్యి వయసు మీద పడి కృష్ణా రామా అనుకుంటూ కూర్చోవాల్సిన వయసులో నాలుగో పెళ్లికి రెడీ అవ్వడం ఈ విషయం తెలిసిన వారందరినీ షాక్ కి గురి చేస్తోంది.

English summary
He is over 60 years old. However, the oldman tortured his wife and got ready for his fourth marriage. In addition to harassing his wife and evicting her from the house, the impatient wife lodged a complaint at the police station against husband, who was preparing for a fourth marriage, threatening to file for divorce. The incident, took place in the state of Andhra Pradesh, has taken everyone shock.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X