రామ్గోపాల్ వర్మ కొత్త చిత్రం! కమ్మ రాజ్యంలో కడప రెడ్లు: వైఎస్ జగన్కు తలనొప్పేనా?
అమరావతి: వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా తలనొప్పులను తీసుకొచ్చే పనిలో పడ్డారు. ఆయన తన కొత్త సినిమాను ప్రకటించారు. దర్శకుడు సినిమాలను తీయడం సాధారణమే. ఆ తీసే సినిమాల కథాంశం వైఎస్ జగన్ నేతృత్వంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వానికి ఖచ్చితంగా ఇరకాటంలో పడేసేది ఉంటుందని అంటున్నారు. దీనికి కారణం- సినిమా టైటిల్. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనేది ఆ మూవీ టైటిల్.
పేరే ఇంత వివాదాస్పదంగా ఉంటే ఇక సినిమా ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. పైగా ఈ సినిమా మొత్తాన్నీ రాజధాని అమరావతి, విజయవాడ పరిసరాల్లోనే తెరకెక్కిస్తాననీ తెలిపారు ఆయన. రాజధాని అమరావతి, విజయవాడ పరిసర ప్రాంతాలన్నీ కమ్మ సామాజిక వర్గం ఏలుతున్న రాజ్యమని, అందులో- కడప నుంచి వచ్చిన రెడ్డి సామాజిక వర్గ ప్రజలు ఎలా పాగా వేశారనే అంశం చుట్టే సినిమా ఉంటుందనేది ఫిల్మ్నగర్ టాక్. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా నిర్మాత రాకేష్ రెడ్డి దీన్ని నిర్మిస్తున్నారు.
My next telugu film title is “KAMMA RAAJYAM LO KADAPA REDLU” ..It will be entirely shot in Vijayawada and Amaravathi and will be produced by Rakesh Ředdy in the same combination of #LakshmisNTR
— Ram Gopal Varma (@RGVzoomin) May 26, 2019
వైఎస్ జగన్ కూడా కడపకు చెందిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుడే. కమ్మ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా.. రెడ్డి సామాజిక వర్గానికి అనుకూలంగా సినిమా చిత్రీకరణ ఉండొచ్చు. కమ్మ వారిని విలన్గా, రెడ్లను హీరోలుగా చూపించడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే- రాష్ట్రంలోని రెండు ప్రధాన కులాల మధ్య చిచ్చు పెట్టినట్టవుతుంది. దీన్ని అడ్డు పెట్టుకుని కమ్మ సామాజిక వర్గం.. వైఎస్ జగన్ను టార్గెట్గా చేసినా చేస్తారు. ఫలితంగా- శాంతి భద్రతల సమస్య తలెత్తవచ్చు. రామ్ గోపాల్ వర్మ ప్రకటించిన ఈ ప్రాజెక్ట్ను కొత్త ప్రభుత్వం ఆపడానికి ప్రయత్నిస్తుందా? లేదా చూసీ చూడనట్టు వ్యవహరిస్తుందా? అనేది ఆసక్తికరం.