లక్ష్మీస్ ఎన్టీఆర్కు ఏపి లో బ్రేక్..? జయలలిత స్పూర్తిగా : సినిమా లో పొలిటికల్ వార్..!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే రాం గోపాల్ వర్మ తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ ఏపిలో విడుదల అవుతుందా. ఇందు కు ఏపి ప్రభుత్వం అనుమతి ఇస్తుందా. ఇప్పటికే విడదలైన ఒక్క పాటతోనే సినిమా ఉద్దేశం ఏంటో తెలిసిపోయింది. ఆ పాట పై టిడిపి నేతలు మండి పడుతున్నారు. వచ్చేది ఎన్నికల సీజన్..ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయంగా ప్రభా వం చూపే ఈ సినిమా కు ఏపిలో బ్రేక్ పడుతుందా..ఏపి ప్రేక్షకులకు విందు పంచుతుందా..
బాలకృష్ణ సినిమాకు ఇబ్బందులు లేనట్లేనా..
ప్రస్తుతం బయో పిక్లు రాజకీయ హంగామా సృష్టిస్తున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ పేరుతో బాలకృష్ణ తన తండ్రి స్వీయ చరిత్రను సినిమాగా వెండి తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఆ సినిమా కు సంబంధించి ఆడియో కూడా విడుదల చేసారు. ఈ సినిమా పై అంచనాలు ఉన్నా..వివాదాలు లేవనే చెప్పాలి. తండ్రి సినిమా లో ఎక్కువగా ఎన్టీఆర్ సినిమా- రాజకీయ జీవితం గురించి మాత్రమే బాలకృష్ణ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. ఎన్టీఆర్ జీవితం లో లక్ష్మీ పార్వతి ప్రవేశం.. వైశ్రాయ్ హోటల్ ఎపిసోడ్..ఎన్టీఆర్ పదవీచ్యుతులు కావటం వంటి వాటికి బాలకృష్ణ తన సినిమాలొ అవకాశం ఇస్తా రా లేదా అనేది సందేహమే. అయితే, ఇదే సమయంలో పోటీగా రాం గోపాల్ వర్మ తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా లో ఈ అంశాలను చూపించే అవకాశం ఉంది. వర్మ ఉద్దేశం ఏంటో ఇప్పటికే స్పష్టమైంది. అయితే, కలెక్షన్ల కంటే ఎన్టీఆర్ జీవిత చరిత్ర ను వెండి తెరకు ఎక్కించటమే బాలకృష్ణ లక్ష్యంగా కనిపిస్తోంది. దీంతో...సాఫీగా వివాదాలకు దూరంగా ఎన్టీఆర్ జీవిత చరిత్రను బాలకృష్ణ వెండి తెరకు ఎక్కించనున్నారు.
లక్ష్మీస్ ఎన్టీఆర్ కు అడ్డంకులు తప్పవా..
బాలకృష్ణ సినిమాకు పోటీగా రాం గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో మరో బయోపిక్ తీస్తున్నారు. ఇందులో పూర్తిగా ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీ పార్వతి ప్రవేశం తరువాతి నుండే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వర్మ విడుదల చేసిన వెన్నుపోటు పాట టిడిపిలో ప్రకపంనలు సృష్టిస్తోంది. వర్మ పై టిడిపి నేతలు పోలీసులకు ఫిర్యా దు చేయటం..వర్మ దిష్టిబొమ్మలను తగుల బెట్టారు. ఇక, పిఠాపురం ఎమ్మెల్యే వర్మ సినిమాలో పాట తొలిగించాలని హై కోర్టును ఆశ్రయించారు. సీఎం చంద్రబాబుకు కళంకం ఆపాదించే విధంగా అభ్యంతరకర పదజాలంతో ‘దగా దగా కుట్ర' అనే చరణంతో ఉన్న ఆ పాటపై సెన్సార్ బోర్డు, కేంద్ర సమాచార ప్రసారాల శాఖ జోక్యం చేసుకోవాలని కోరారు. అయితే,ఆ సినిమా మొత్తం వైశ్రాయ్ హోటల్ ఎపిసోడ్..ఎన్టీఆర్ పదవీచ్యుతులు అయిన అంశాల పై ప్రధానంగా ఫోక స్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇది వ్యక్తిగతంగానే కాకుండా..రాజకీయంగా తమకు నష్టమని టిడిపి నేతలు భావిస్తున్నారు . దీనిలోని అభ్యంతరాల పై న్యాయ పరంగా పోరాటం చేయటం..అక్కడ సక్సెస్ కాకుంటే..ఎన్నికల వరకు సినిమా విడుదలకు ఏపిలో అనుమతి నిరాకరించాలనేది టిడిపి ఆలోచనగా తెలుస్తోంది.
విశ్వరూపం తరహాలో..జయలలిత స్పూర్తిగా...
ప్రస్తుతం బాలకృష్ణ..రాం గోపాల్ వర్మ ఇద్దరూ తీస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ లు రాజకీయంగా టిడిపి కి ఎంత వరకు మేలు చేస్తాయి..ఏ మేర నష్టం చేస్తాయనేది ఇప్పుడు టిడిపి నేతలు లోతుగా ఆలోచిస్తున్నారు. ఇదే సమయంలో వైయస్ బయోపిక్ సైతం హడావుడి చేస్తోంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ రాజకీయంగా నష్టం జరిగే పరిస్థితుల్లో సినిమా విడుదల కు సిద్దమైతే..వెంటనే తమిళనాడులో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏ విధంగా అయితే నిర్ణయం తీసుకున్నారో..అదే తరహాలో ఏపి లోనూ ప్రభుత్వానికి ఉన్న అధికారాలను వినియోగించుకోవాలని భావిస్తున్నారు. తమిళనాడు లో విశ్వరూపం సినిమా పై అభ్యంతరాలు రావటంతో..నేరుగా ముఖ్యమంత్రి ఆ సినిమా కు అనుమతి నిరాకరిస్తూ నిర్ణయ తీసుకున్నారు. ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ కు ఏపిలో అదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. మరి.. ఏపి ప్రభుత్వం ఇప్పటిక మొదలు పెట్టిన న్యాయ పోరాటం ఎటువంటి నిర్ణయాలకు కారణమవుతుందో.. రానున్న రోజుల్లో ఈ సినిమా ఎటువంటి వివాదాలకు దారి తీస్తుందో చూడాలి.