పోలీసుల అదుపులోనే ఆర్కే, గణేష్: వరవరరావు సంచలనం
హైదరాబాద్/విశాఖపట్నం: విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు గురువారం సంచలన ఆరోపణలు చేశారు. మావోయిస్టు అగ్రనేతలు ఆర్కే, గణేష్ తోపాటు పలువురు కీలక నేతలు పోలీసుల అదుపులోనే ఉన్నారని ఆరోపించారు. సోమవారం ఎన్కౌంటర్ జరిగిన రోజే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అనుమానం వ్యక్తం చేశారు.
పోలీసుల అదుపులో ఉంటే వారికి ప్రాణహాని తలపెట్టే అవకాశం ఉందని, వెంటనే వారిని కోర్టులో హాజరుపర్చాలని వరవరరావు డిమాండ్ చేశారు. అయితే, పోలీసులు మాత్రం ఆర్కే, గణేష్ తోపాటు పలువురు అగ్రనేతలు ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్నారని ఇప్పటికే పేర్కొన్న విషయం తెలిసిందే.
అగ్రనేతలే టార్గెట్గా కూంబింగ్
మల్కాన్గిరి అటవీ ప్రాంతంలో ఆంధ్రా-ఒరిస్సా పోలీసులు గురువారం కూడా కూంబింగ్ కొనసాగిస్తున్నారు. అగ్రనేతలు రవి, ఆర్కేలు లక్ష్యంగా ఆపరేషన్ జరుగుతున్నట్లు సమాచారం. మావోయిస్టుల డెన్ సమీపంలోని కట్ ఆఫ్ ఏరియాలో పోలీసులు భారీగా మోహరించిన ట్లు తెలిసింది.
'తల లేని మొండెం, వక్షభాగం రక్తసిక్తం': వరవరరావు కంటతడి
ఇది ఇలా ఉండగా, సుకుమా జిల్లా కొంట సమీపంలో మురళిగూడ బండ వద్ద ఓ వ్యక్తి మృతదేహం లభించింది. ఆ మృతదేహం వద్ద మావోయిస్టులు కొన్ని పోస్టర్లు వదిలేసి వెళ్లినట్లు తెలిసింది.