వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీసుల అదుపులోనే ఆర్కే, గణేష్: వరవరరావు సంచలనం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/విశాఖపట్నం: విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు గురువారం సంచలన ఆరోపణలు చేశారు. మావోయిస్టు అగ్రనేతలు ఆర్కే, గణేష్ తోపాటు పలువురు కీలక నేతలు పోలీసుల అదుపులోనే ఉన్నారని ఆరోపించారు. సోమవారం ఎన్‌కౌంటర్ జరిగిన రోజే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అనుమానం వ్యక్తం చేశారు.

పోలీసుల అదుపులో ఉంటే వారికి ప్రాణహాని తలపెట్టే అవకాశం ఉందని, వెంటనే వారిని కోర్టులో హాజరుపర్చాలని వరవరరావు డిమాండ్ చేశారు. అయితే, పోలీసులు మాత్రం ఆర్కే, గణేష్ తోపాటు పలువురు అగ్రనేతలు ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకున్నారని ఇప్పటికే పేర్కొన్న విషయం తెలిసిందే.

Varavara Rao

అగ్రనేతలే టార్గెట్‌గా కూంబింగ్

మల్కాన్‌గిరి అటవీ ప్రాంతంలో ఆంధ్రా-ఒరిస్సా పోలీసులు గురువారం కూడా కూంబింగ్ కొనసాగిస్తున్నారు. అగ్రనేతలు రవి, ఆర్కేలు లక్ష్యంగా ఆపరేషన్ జరుగుతున్నట్లు సమాచారం. మావోయిస్టుల డెన్ సమీపంలోని కట్ ఆఫ్ ఏరియాలో పోలీసులు భారీగా మోహరించిన ట్లు తెలిసింది.

'తల లేని మొండెం, వక్షభాగం రక్తసిక్తం': వరవరరావు కంటతడి 'తల లేని మొండెం, వక్షభాగం రక్తసిక్తం': వరవరరావు కంటతడి

ఇది ఇలా ఉండగా, సుకుమా జిల్లా కొంట సమీపంలో మురళిగూడ బండ వద్ద ఓ వ్యక్తి మృతదేహం లభించింది. ఆ మృతదేహం వద్ద మావోయిస్టులు కొన్ని పోస్టర్లు వదిలేసి వెళ్లినట్లు తెలిసింది.

English summary
Varavara Rao on Thursday claimed that Maoist top leaders RK and Ganesh are in police custody.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X